ప్రతిపక్షాల ఆటలు సాగవు
న్యూఢిల్లీ :అక్రమమార్గాల్లో అధికారం దక్కించుకోవడానికి ప్రయత్నించేవారి ఆటలను తాను ఎట్టి పరిస్థితిలోనూ సాగనివ్వనని ప్రధాని వాజ్పేయి తీవ్రంగా హెచ్చరించారు. మంగళవారం నాడు బీజేపీ ఎంపీల సమావేశంలో ప్రసంగించిన ప్రధాని, తహల్కా బయటపెట్టిన రక్షణ శాఖ అవినీతికి సంబంధించిన వ్యవహారంలో నిజానిజాలు ప్రజలకు తెలియజేయాల్సిందిగా ఎంపీలను ఆయన కోరారు.
ప్రతిపక్షాలు పనిగట్టుకుని తమ ప్రభుత్వాన్ని అస్థిరం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. తమకు గానీ తమ మంత్రి వర్గ సహచరులకు గానీ రక్షణ శాఖ అవినీతితో ఏలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలు
ఈ
విషయంలో
మొహం
చెల్లకనే
పార్లమెంట్లో
చర్చకు
నిరాకరిస్తున్నాయని
ఆయన
దుయ్యబట్టారు.
ప్రజలు
తిరస్కరించినవారు
తమను
ఇప్పుడు
బ్లాక్మెయిల్
చేస్తున్నారని
ఆయన
తీవ్రంగా
తూర్పారబట్టారు.
తమ
ప్రభుత్వాన్ని
కూలదోయడం
ప్రతిపక్షాల
వశం
కాదని
ఆయన
స్పష్టం
చేశారు.
ప్రతిపక్షాల
కుట్రవిషయంలో
పార్టీ
ఎంపీలంతా
అప్రమత్తంగా
వుండాలని
ఆయన
విజ్ఞప్తి
చేశారు.