బాంబు కుట్రపైఅసెంబ్లీలో వివాదం
హైదరాబాద్: కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) నాయకుడు డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి తనయుడుజగన్మోహన్ రెడ్డి సూట్కేసు బాంబు కుట్రకేసులో ఉన్నట్లు పోలీసులు తేల్చిన విషయంపైమంగళవారం శాసనసభలో వివాదంచెలరేగింది. రాయలసీమలోని తెలుగుదేశంముఖ్యనాయకుల హత్యకు జరిగినకుట్రలో జగన్మోహన్రెడ్డి వున్నట్లు పోలీసులు కేసుపెట్టిన విషయం తెలిసిందే.
జగన్మోహన్ రెడ్డికుట్రలో భాగస్వామి అనే అంశంపై చర్చకు అనుమతించాలని కోరుతూతెలుగుదేశం, బిజెపి సభ్యులు వాయిదా తీర్మానాలుఇచ్చారు. ఈ తీర్మానాలను స్పీకర్ కె. ప్రతిభా భారతి త్రోసిపుచ్చుతూ ఈవిషయమై హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్ ఒక ప్రకటన చేస్తారనిచెప్పారు. దీనికి తెలుగుదేశం, బిజెపి సభ్యులుఅంగీకరించారు. హోం మంత్రి ప్రకటనపై చర్చకు అనుమతించాలనికాంగ్రెస్ కోరింది. ఇందుకు స్పీకర్ అనుమతించారు.హోం మంత్రి ప్రకటన చేసిన వెంటనే దానిపైచర్చ ప్రారంభమైంది. చర్చను ప్రారంభించడానికి బిజెపికి అనుమతిఇవ్వడం పట్ల కాంగ్రెస్, సిపిఎం, మజ్లీస్ అభ్యంతరం తెలిపాయి.నోటీసు ఇచ్చిన వారికే మొదట మాట్లాడడానికిఅవకాశం ఇస్తామని స్పీకర్ చెప్పారు.
రాయలసీమలో ముఠాకక్షలను, నేరాలను అదుపు చేయడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేయాలని ఎన్. ఇంద్రసేనా రెడ్డి (బిజెపి)కోరారు. తన కుమారుడు హత్యకు జరిగినకుట్రలో నిందితుడైనందున నైతిక బాధ్యతవహించి సిఎల్పి నాయకుడు రాజశేఖరరెడ్డి రాజీనామాచేయాలని బ్రహ్మయ్య (తెలుగుదేశం) డిమాండ్చేశారు. కుమారుడు జగన్మోహన్ రెడ్డిని పోలీసులకుసరెండర్ చేయించాలని ఆయనరాజశేఖరరెడ్డికి సూచించారు.
తెలుగుదేశం పార్టీదేబాంబుల, హత్యల సంస్కృతి అని డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డివిమర్శించారు. తనను ఫ్యాక్షనిస్టుగా చిత్రీకరించడానికికొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, ఇందులో భాగంగానే ఇప్పుడు తప్పుడు కేసులు బనాయించారనిఆయన అన్నారు. ఈ విషయంపై తాను ఏ విచారణకైనాసిద్ధమేనని, నిష్పాక్షిక విచారణకు సిబిఐ చేతదర్యాప్తు చేయించాలని రాజశేఖర్ రెడ్డి అన్నారు.
-
బాంబుల
కుట్రలో
వైఎస్
కుమారుడు