తెహెల్కా టేపులవెనుక కుట్ర: బిజెపి
న్యూఢిల్లీ: ఇటీవలి మూడు సంఘటనలవెనుక కుట్ర వున్నదని భారతీయ జనతా పార్టీ(బిజెపి) భావిస్తోంది. ఖురాన్ను దగ్ధంచేశారనే ప్రచారంతో అల్లర్లు చెలరేగడం వెనుక,తెహెల్కా డాట్కామ్ బయట పెట్టిన రక్షణ కుంభకోణంవెనుక, ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచేషేర్ మార్కెట్ పతనం వెనుకు కుట్ర వున్నదని బిజెపి పార్లమెంటరీ పార్టీఅధికార ప్రతినిధి వి.కె. మల్హోత్రా బుధవారంవిలేకరులతో అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే ప్రస్తుత తరుణంలో ఈ సంఘటనలుచోటుచేసుకున్నాయని, అందువల్ల ఈ కుట్రలోకాంగ్రెస్ పాత్రను తీసేయలేమని ఆయన అన్నారు.వెబ్సైట్ ఆరోపణలపై నియమించే న్యాయవిచారణ సంఘంపరిధిలోకి కుట్రకు సంబంధించిన అంశాన్ని కూడా చేర్చనున్నట్లుఆయన తెలిపారు.
పార్లమెంటు కార్యకలాపాలనుకాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు స్తంభింపజేయడందురదృష్టకరమని ఆయన అన్నారు. పార్లమెంటును స్తంభింపజేయడంవల్ల ప్రజా ప్రయోజనాలకు సంబంధించినఅంశాలు చర్చకు రావడం లేదని ఆయనచెప్పారు.
పార్లమెంటును స్తంభింపజేస్తున్నకాంగ్రెస్ తమ పార్టీ వైఖరిని స్పష్టం చేసేందుకుసోనియాకు దూరదర్శన్లో మాట్లాడే అవకాశం కల్పించాలని కోరడం ఆశ్చర్యకరమనిఆయన అన్నారు. తన రాజీనామాకు ముందుపార్లమెంటులో తన అభిప్రాయాలనువెల్లడించేందుకు అవకాశం లేకపోవడంవల్ల జార్జి ఫెర్నాండెజ్కు దూరదర్శన్లో మాట్లాడేఅవకాశం కల్పించినట్లు ఆయనసమర్థించుకున్నారు.