చిదంబరంసస్పెన్షన్కు టిఎంసి చర్యలు
చెన్నై: తిరుగుబాటు నాయకుడుపి.చిదంబరంను, ఆయన అనుచరులను పార్టీనుంచి సస్పెండ్ చేసే అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు జి.కె.ముపనార్కుఅప్పగిస్తూ తమిళ మనీలా కాంగ్రెస్ (టిఎంసి) అత్యవసర కార్యవర్గ సమావేశం తీర్మానంచేసింది. పార్టీ కార్యకలాపాలకు పాల్పడినందుకుచిదంబరంను, ఆయన అనుచరులను బహిష్కరించేందుకుచర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించిందనిముపనార్ సమావేశానంతరం విలేకరులతోచెప్పారు. సమావేశంలో చేసిన తీర్మానాలను పార్టీ క్రమశిక్షణా సంఘానికి పంపినట్లుఆయన తెలిపారు.
అన్నాడియంకెతో టిఎంసి పొత్తుకుదుర్చుకోవడాన్ని చిదంబరం వ్యతిరేకించారు.తాను పెట్టిన ఫోరమ్ను పార్టీగా మార్చునున్నట్లుచిదంబరం ప్రకటించారు.
అన్నాడియంకె నేతృత్వంలోని ఫ్రంట్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని కూడాప్రకటించారు. ముగ్గురు శాసనసభ్యులు చిదంబరంనుబలపరుస్తున్నారు. చిదంబరం డిఎంకె అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కరుణానిధినికలిశారు. అయితే, డిఎంకెకు, ఫోరంకు మధ్య ఎన్నికల పొత్తు ఇంకాకుదరలేదు.