వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సోనియా పర్సనల్సెక్రటరీపై సిబిఐ కేసు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలుసోనియాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి విన్సెంట్జార్జిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ (సిబిఐ)బుధవారం కేసు నమోదు చేసింది. ఆదాయానికిమించి ఆస్తులు కలిగి వున్నాడనే ఆరోపణపైజార్జిపై సిబిఐ ఈ కేసు నమోదు చేసింది.
జార్జిపై సిబిఐ ప్రత్యేక కోర్టున్యాయమూర్తి ఆర్ ఎల్ ఛుగ్ ముందు బుధవారంఉదయం ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు సిబిఐ వర్గాలుచెప్పాయి. కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులను జార్జినుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఈ వర్గాలుచెప్పాయి. జార్జి స్వర్గీయ రాజీవ్ గాంధీ వ్యక్తిగతకార్యదర్శిగా కూడా పని చేశారు.
Story first published: Wednesday, March 21, 2001, 23:53 [IST]