నకిలీ నక్సల్స్ కు ఐ.పి.ఎస్.ల అండ
హైదరాబాద్ః నక్సలైట్లమని చెప్పుకుంటూ జంటనగరాలలో ప్రముఖుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్న వ్యక్తులకు కొందరు ఐ.పి.ఎస్. ల అండదండలున్నాయనే ఆరోపణలతో బుధవారం అసెంబ్లీలో రభస జరిగింది. ఎం.ఐ.ఎం. సభా పక్ష నాయకుడు అసదుద్దీన ఒవైసీ జీరో అవర్ లో ఈ అంశాన్ని ప్రస్తావించారు.
నక్సలైట్లమంటూ కొందరు వ్యక్తులు నగరంలో ప్రముఖుల నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేశారని ఆయన చెప్పారు. వారిని అరెస్టు చేస్తే, తక్షణం వారిని విడుదల చేయాల్సిందిగా కమిషనర్ పై బడా బాబుల నుంచి వత్తిళ్ళు వస్తున్నాయని అసదుద్దీన్ ఆవేశంగా అన్నారు. రాష్ట్ర రాజధాని నగరంలో ఇంత దారుణం జరుగుతుంటే ప్రభుత్వం ఎలా కళ్ళు మూసుకు కూర్చుంటున్నదని ఆయన ప్రశ్నించారు.
నకిలీ
నక్సలైట్లకు
ఇద్దరు
ముగ్గురు
ఐ.పి.ఎస్.
అధికారుల
అండదండలున్నాయని
ఆయన
అన్నారు.
ఈ
అంశంపై
రాష్ట్ర
హోం
శాఖ
మంత్రి
దేవేందర్
గౌడ్
మాట్లాడుతూ
దోషులు
ఎవరినీ
వదిలిపెట్టే
ప్రసక్తి
లేదని
స్పష్టం
చేశారు.
ఇప్పుడే
సభలో
ఈ
అంశాన్ని
ప్రస్తావించి
వెంటనే
చర్య
తీసుకోమనడం
భావ్యం
కాదని,
విచారణ
జరిపించి
దోషులు
ఎంతటి
వారైనా
సత్వర
చర్యలు
తీసుకుంటామని
ఆయన
హామీ
ఇచ్చారు.