అసెంబ్లీ నుంచివైఎస్ బృందం గెంటివేత Home Full Story
హైదరాబాద్ః మద్యంకొనుగోలులో జరుగుతున్న అక్రమాలపై రణభేరిమోగించిన కాంగ్రెస్ పార్టీ సభ్యులను గురువారంఅసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. సభ నుంచిస్వచ్ఛందంగా బయటకు వెళ్ళేందుకు నిరాకరించినకాంగ్రెస్ సభ్యులను బలవంతంగా మార్షల్స్గెంటివేశారు. ప్రభుత్వం పశుబలంతో ప్రతిపక్షాలనోళ్ళు నొక్కుతున్నదంటూ ఎం.ఐ.ఎం., సిపిఎం పార్టీలుఅసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాయి.
గురువారం అసెంబ్లీ ప్రారంభంనుంచి కాంగ్రెస్ సభ్యులు మద్యంకొనుగోలులో జరిగిన అవినీతిపై విచారణ జరపాల్సిందిగా పట్టుపట్టారు. ఈ అంశంపై హైకోర్టు ఇప్పటికే రూలింగ్ ఇచ్చినదృష్ట్యా మళ్ళీ విచారణ జరపాల్సిన అవసరంలేదని అధికార పక్షం స్పష్టం చేసింది. వెయ్యి కోట్లమద్యం కొనుగోలు వ్యవహారంలో సి.ఎం. కు ఎంతముడుపులు ముట్టాయంటూ ప్లే కార్డులు పట్టుకొనికాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.
స్పీకర్ ప్రతిభా భారతి విజ్ఞప్తులను ఏ మాత్రంపట్టించుకోకుండా వారు నిరసన కొనసాగించారు. ఒకదశలో తెలుగుదేశం, కాంగ్రెస్ సభ్యుల మధ్యవాగ్యుద్ధం కూడా జరిగింది. పరిస్థితి ఎంతసేపటికీఅదుపులోకి రాకపోవడంతో సభను కొద్ది సేపువాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఆ తరువాత సభ ప్రారంభంఅయినప్పటికీ కాంగ్రెస్ వారు ఏ మాత్రం తగ్గలేదు.మద్యం కొనుగోలుపై విచారణ జరిపించాల్సిందేనంటూపట్టుపట్టారు.
సభా కార్యక్రమాలకుఅంతరాయం కలిగిస్తున్న సభ్యులను సస్పెండ్చేయాలంటూ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రియనమల రామకృష్ణుడు ప్రతిపాదించగా స్పీకర్అందుకు ఆమోదం తెలిపారు. కాంగ్రెస్సభ్యులందరినీ ఒక రోజు పాటు అసెంబ్లీ కార్యక్రమాలనుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ప్రకటించారు. అయినప్పటికీ కాంగ్రెస్ సభ్యులు తమసీట్ల నుంచి కదలక పోవడంతో మార్షల్స్ రంగ ప్రవేశంచేశారు. వారు బలవంతంగా కాంగ్రెస్ సభ్యులనుఅసెంబ్లీ నుంచి బయటకు తీసుకువెళ్ళారు.
ప్రతిపక్షాలను అధికార పక్షంపశుబలంతో అణచివేయాలని చూస్తున్నదంటూసిపిఎం, ఎం.ఐ.ఎం. పార్టీలు స్పీకర్ కు నిరసన వ్యక్తంచేశాయి. సిపిఎం పార్టీ సభ నుంచి వాకౌట్చేసింది.
- ఆంధ్ర అసెంబ్లీకి మద్యం కిక్కు!
- మాగుంటను
సస్పెండ్చేయండి:
బాబు