వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్కంఠ మ్యాచ్‌ లో భారత్‌ జయభేరి

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నయ్‌ః భారత్‌ - ఆస్ట్రేలియా జట్ల మధ్య చెన్నయ్‌ లో జరిగిన ఉత్కంఠ భరిత మూడోటెస్ట్‌ మ్యాచ్‌ లో భారత్‌ ఘన విజయం సాధించింది. దీనితో మూడు మ్యాచ్‌ ల సిరీస్‌ లో రెండు మ్యాచ్‌ లు గెలుచుకొని భారత్‌ సిరీస్‌కైవసం చేసుకుంది. వరసగా 17 మ్యాచ్‌ లలోవిజయం సాధించిన ఆస్ట్రేలియా విజయపరంపరకు అడ్డుకట్ట వేసి సొంత గడ్డపై భారత్‌ పై గెలవడం అంత తేలిక కాదని గంగూలీ బృందం నిరూపించింది.

భారత్‌ టాప్‌ బ్యాట్స్‌ మెన్‌ అంతా చీప్‌ గా అవుటయినప్పటికీ లక్ష్మణ్‌ 66 పరుగులు, కొత్తవికెట్‌ కీపర్‌ సమయోచిత బ్యాటింగ్‌ భారత్‌ కు చివరిటెస్ట్‌ లో గెలుపు సాధించి పెట్టాయి.
155 పరుగులు లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ 134 పరుగులకు లక్ష్మణ్‌ తో సహా ఏడువికెట్లు కోల్పోయి పీకల లోతు కష్టాలలో పడింది.

డ్రస్సింగ్‌ రూం లో కూర్చున్న కెప్టెన్‌ గంగూలీ మ్యాచ్‌ పై ఆశలు వదులుకున్నాడు. అయితే టెయిల్‌ ఎండ్‌ బ్యాట్స్‌ మెన్‌ భారత్‌ కువిజయం చేకూర్చి పెట్టారు. కొత్త వికెట్‌ కీపర్‌ సమీర్‌ డిఘేమిల్లర్‌ బౌలింగ్‌ లో వరుసగా రెండు ఫోర్లు సాధించి భారత్‌ ఆశలకు జీవం పోశాడు. జహీర్‌ఖాన్‌ కూడా పరుగులు ఏమీ చేయకుండా అవుట్‌ కావడంతో గంగూలీ ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి. బౌలింగ్‌ లో అద్భుతాలు సృష్టించిన హర్భజన్‌ డిఘేకు మద్దతు ఇవ్వడానికి తోడువిన్నింగ్‌ షాట్‌ కొట్టి భారత్‌ కు విజయం చేకూర్చి పెట్టాడు. భారత్‌ లక్ష్యానికి అవసరమైన 155 పరుగులు సాధించడంతో చేపాక్‌ స్టేడియంవిజయ ధ్వానాలతో మారుమోగి పోయింది.

మ్యాచి పైన అదే విధంగా సిరీస్‌ పైన ఆశలు వదులుకున్న గంగూలీ ఒక్క సారిగా సింహనాదం చేసి డ్రస్సింగ్‌ రూం లో చిందులు తొక్కాడు. హర్భజన్‌ కు మ్యాన్‌ అఫ్‌ దిమ్యాచ్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు లభించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X