వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రెండు పోలీస్టేషన్లపై నక్సల్స్ దాడి
కర్నూలుః కర్నూలు జిల్లాలో బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత నక్సలైట్లు విజృంభించారు రెండు పోలీస్టేషన్లను ధ్వసం చేశారు.శ్రీశైలం కొత్తపెంట పోలీస్టేషన్లపై బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత సుమారు 20 మంది సాయుధులైన నక్సలైట్లు దాడి చేశారు. రాత్రిపూట పోలీస్టేషన్ కు కాపలాగా వున్నా కానిస్టేబుల్ ను ఒక గుంజకు కట్టేసి నక్సలైట్లు పోలీస్టేషన్లను ధ్వంసం చేశారు ఆ తరువాత పోలీస్టేషన్ లో వున్న తుపాకులను వారుఅపహరించుకుపోయారు.
కర్నూలు జిల్లాలో జరిగిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రెండు పోలీస్టేషన్లను ధ్వంసం చేయడంతో పాటు తుపాకులను కూడా నక్సలైట్లుఅపహరించుకు పోవడం పోలీసు వర్గాలలో కలవరం సృష్టించింది.
Comments
Story first published: Thursday, March 22, 2001, 23:53 [IST]