వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌: పన్నులవసూల బాధ్యతను ఇక జిల్లా కలెక్టర్లకుఅప్పగించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుచెప్పారు. జిల్లా కలెక్లర్లతో, ఉన్నతాధికారులతోఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. ప్రభుత్వంనిర్దేశించిన లక్ష్యాన్ని మించి పన్నులు వసూలు చేస్తే ఆవిధంగా వసూలు చేసిన జిల్లాకే ఆ మొత్తాన్నిఇస్తామని, ఈ మొత్తాన్ని జిల్లా అభివృద్ధికివాడుకోవచ్చునని ఆయన అన్నారు.పన్నుల వసూళ్లకురీజినల్‌, జోనల్‌ అంటూ సంక్లిష్ట విధానం అవసరం లేకుండా సరళీకరిస్తామనిఆయన చెప్పారు. అనవసరమైన రెండు మూడు శాఖలను తీసేస్తామనిఆయన చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియను ఏప్రిల్‌ చివరినాటికి పూర్తిచేయనున్నట్లు, మానవ శక్తిని సమర్థంగావాడుకోవడానికి తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుఆయన తెలిపారు. స్థానిక సంస్థలు పన్నుల వసూళ్లపై,ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పన్నులవసూల బాధ్యతను ఇక జిల్లా కలెక్టర్లకుఅప్పగించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుచెప్పారు. జిల్లా కలెక్లర్లతో, ఉన్నతాధికారులతోఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. ప్రభుత్వంనిర్దేశించిన లక్ష్యాన్ని మించి పన్నులు వసూలు చేస్తే ఆవిధంగా వసూలు చేసిన జిల్లాకే ఆ మొత్తాన్నిఇస్తామని, ఈ మొత్తాన్ని జిల్లా అభివృద్ధికివాడుకోవచ్చునని ఆయన అన్నారు.

పన్నుల వసూళ్లకురీజినల్‌, జోనల్‌ అంటూ సంక్లిష్ట విధానం అవసరం లేకుండా సరళీకరిస్తామనిఆయన చెప్పారు. అనవసరమైన రెండు మూడు శాఖలను తీసేస్తామనిఆయన చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియను ఏప్రిల్‌ చివరినాటికి పూర్తిచేయనున్నట్లు, మానవ శక్తిని సమర్థంగావాడుకోవడానికి తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుఆయన తెలిపారు.

స్థానిక సంస్థలు పన్నుల వసూళ్లపై,ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి కేంద్రీకరించకుండాప్రభుత్వంపై ఆధారపడుతుండడం వల్ల సమస్యలుఎదురువుతున్నాయని ఆయన అన్నారు. ప్రణాళికేతరవ్యయాన్ని, అనవసరమైన ఖర్చులు తగ్గిస్తామనిఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X