వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విజయవాడ-చెన్నయ్ మధ్యవాటర్ వే
హైదరాబాద్ః ఆంధ్రరాష్ట్రంలో జల రవాణాను అభివృద్ధిచేసేందుకు సకలచర్యలు తీసకుంటున్నట్లుతెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది. జలరవాణాఅభివృద్ధికి 558 కోట్ల రూపాయలతో ఒక బృహత్తర ప్రణాళికనురూపొందించనట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి మండవవెంకటేశ్వర రావు శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలసమయంలో వెల్లడించారు.
బకింగ్ హాం కాలువ ద్వారామద్రాసు వరకు జలరవాణా సౌకర్యాలను మెరుగుపరచేందుకు ఒక ప్రణాళికరూపొందించి కేంద్రం ఆమోదానికి పంపినట్లు ఆయనచెప్పారు. ఇదే కాకుండా మరిన్ని జలరవాణా సౌకర్యాలనుకల్పించుకొనేందుకు కేంద్రంతో సంప్రదిస్తున్నట్లు మండవచెప్పారు. అంతర్ రాష్ట్ర జలరవాణా వ్యవస్థను అభివృద్ధిచేయాలన్నదే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమనిఆయన చెప్పారు.
Comments
Story first published: Friday, March 23, 2001, 23:53 [IST]