వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బి.సి.లెక్కల్లో గోల్‌ మాల్‌ఃకాంగ్రెస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః వెనుకబడిన కులాల జనాభా లెక్కలసేకరణలో పెద్ద ఎత్తున అక్రమాలుజరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు మంగళవారంఅసెంబ్లీలో ధ్వజమెత్తాయి. హైకోర్టు ఆదేశాలమేరకు రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన కులాల జనాభా లెక్కలసేకరణను చేపట్టింది. అయితే ఈ జనాభా లెక్కలసేకరణలో స్థానిక నేతలతో అధికారులుకుమ్మక్కై అక్రమాలు చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీఆరోపించింది.

కాంగ్రెస్‌ సభ్యుడు ఎన్‌. రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఎప్పుడోఅరుదుగా చేపట్టే ఇటువంటి జనాభా లెక్కలసేకరణలో అక్రమాలు జరిగితే ఆ తప్పుడు లెక్కలను రాష్ట్రంశాశ్వతంగా భరించాల్సి వస్తుందన్నారు. ఈ వ్యవహారం ప్రభుత్వందృష్టికి వచ్చినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదనిఆయన విమర్శించారు. ఈ వ్యవహారంపై చర్చించేందుకు తక్షణంఅఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగాకాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ఇందుకు అన్ని ప్రతిపక్షాలు కూడామద్దతు పలికాయి.

దీనితో బి.సి. జనాభా లెక్కలసేకరణ అంశంపై ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటుచేసేందుకు సమ్మతించింది. స్థానిక నేతలతోకుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్న సెన్సెస్‌అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్రహోంశాఖ మంత్రి దేవేందర్‌ గౌడ్‌ స్పష్టంచేశారు. అయితే తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయడం సాధ్యం కాదని, అసెంబ్లీ సమావేశాలుముగిసిన వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X