రెండుప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి
మహబూబ్నగర్: మహబూబ్నగర్జిల్లాలో ఆదివారం నాడు రెండు వేర్వేరుప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో మొత్తంఎనిమిది మంది మరణించారు. అడ్డాకులమండలం కందూరు గ్రామంలో జరుగుతున్నరామలింగేశ్వర స్వామి జాతరలో జరిగిన ఒక దుర్ఘటనలోనలుగురు ప్రాణాలు కోల్పోయారు. జాతర జరుగుతున్న గ్రామంలోనివాటర్ ట్యాంకు హఠాత్తుగా కూలిపోవడంతో నలుగురు అక్కడికక్కడేమరణించారు. మరికొందరు గాయపడగా వారినిమహబూబ్నగర్ ఆస్పత్రికి తరలించారు.
కాగా మరో సంఘటనలోహైదరాబాద్నుంచి పుట్టపర్తి వెళ్లుతున్న కారుఎదురుగా వస్తున్న టూరిస్టు బస్సును ఢీకొన్నసంఘటనలో మరో నలుగురు ప్రాణాలు కొల్పోయారు. ఈదుర్ఘటన కొత్తకోట మండటం పాలెం వద్దజరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఒక మహిళను ఆస్పత్రికి తరలించారు. మృతులనువంశి, పూర్ణచంద్రరావు, చంద్రమోహన్, జ్యోతిగాగుర్తించారు. జిల్లా పోలీసులు ఈ సంఘటనలకుసంబంధించిన కేసులను నమోదు చేసుకునిదర్యాప్తు చేస్తున్నారు.