వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కీలక తీర్మానాలకు బీజేపీఆమోదం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గసమావేశంలో జాతీయ, అంతర్జాతీయ పరిణామాలకుసంబంధించి పలు కీలక తీర్మానాలను ఆదివారం నాడుఆమోదించారు. దేశ ఆర్ధిక వ్యవస్థకుసంబంధించిన తీర్మానంలో 2001-2002 సంవత్సరానికి ఆర్ధిక మంత్రియశ్వంత్‌సిన్హా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఘనంగాప్రశంసించారు. బడ్జెట్‌పై ఆన్ని వర్గాల ప్రజలనుంచి సానుకూల ప్రతిస్పందనవచ్చిందనిబీజేపీ కార్యవర్గంఅభిప్రాయపడింది.

అయిదు రాష్ట్రాల్లో త్వరలోనే జరుగనున్నఅసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహంపై కూడా ఒక తీర్మానాన్ని బిజేపీ జాతీయ కార్యవర్గసమావేశాల్లో ఆమోదించారు. పశ్చిమబెంగాల్‌కుసంబంధించి వామపక్షాల పాలనకు స్వస్తిపలికేట్టుగా అక్కడఅసెంబ్లీ ఎన్నికల వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించారు. పశ్చిమ బెంగాల్‌ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేయవచ్చని ప్రధానివాజ్‌పేయి సమావేశంలో చెప్పారు. తృణమూల్‌తో పొత్తుదాదాపు తెగతెంపులయినట్టేనని ఆయన పేర్కొన్నారు.అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో సాధించే విజయం ప్రతిపక్షాలనోటికి తాళం వేస్తుందని కూడా కార్యవర్గ సమావేశంఅభిప్రాయపడింది.

అఎn్ఘానిస్తాన్‌లో తాలిబన్లు బుద్ధవిగ్రహాలను ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ కూడా బీజేపీ జాతీయ కార్యవర్గం తీర్మానాన్ని ఆమోదించింది. తాలిబన్ల చర్య అంతర్జాతీయంగా పెచ్చరిల్లుతున్న మతవాద టెర్రరిస్టు ప్రమాదం తీవ్రతను సూచిస్తున్నది కూడా బీజేపీ అభిప్రాయపడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X