వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికలవ్యయంపై ఉమ్మడి కోడ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎన్నికల వ్యయానికి సంబంధించి రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయంతో ఉమ్మడికోడ్‌ను అమలు చేయాలని ప్రధానివాజ్‌పేయి సూచించారు. బీజేపీ నాయకులు ఈ విషయంలో ఆదర్శంగా వుండేందుకు వీలుగా తమ ఎన్నికల వ్యయాన్ని బహిర్గతం చేయాలని ఆయన కోరారు.

ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న వాజ్‌పేయి విలేకరులతో మాట్లాడుతూ, తహల్కా ఉదంతం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపిందని అన్నారు. వీటిని సరిదిద్దుకోవల్సిన అవసరం వున్నదని ఆయన చెప్పారు.

తహల్కా ఉదంతంలో జర్నలిస్టులను తప్పుపట్టాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలకు తాము సిద్ధంగా వున్నామని ఆయన చెప్పారు. ఇతర రాజకీయ పార్టీలు కూడా ముందుకు వస్తే సంస్కరణల అమలు సులభం అవుతుందని ప్రధాని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X