విద్యుత్ చార్జీలకు ఆరు శ్లాబులు
హైదరాబాద్: విద్యుత్ చార్జీలకుసంబంధించి గృహ వినియోగదారులకు ఆరుశ్లాబులవిధానాన్నిప్రవేశపెడుతున్నట్టుగా ఏపి రెగ్యులేటరీకమిషన్ శనివారం నాడు ప్రకటించింది. వచ్చే ఏప్రిల్ ఒకటినుంచిఅమల్లోకి వచ్చే కొత్త చార్జీల విధానం దాదాపు ఎపీట్రాన్స్కో ప్రతిపాదించినట్టుగానే వున్నది.
గృహవినియోగానికిసంబంధించి ప్రస్తుతం నాలుగు శ్లాబులువుండగా వాటిని ఆరుగా మార్చారు. ఈ ఆరు శ్లాబుల్లోమొదటి శ్లాబు యధాతథంగా వుంటుంది. ఆ తర్వాత మూడుశ్లాబుల్లో రేట్లు కొద్దిగా తగ్గి రెండు శ్లాబుల్లోకొద్దిగా పెరుగుతాయి.
ఈ కొత్త శ్లాబుల వల్ల గృహరంగంలో ఇప్పుడువస్తున్న రాబడి 43 కోట్ల రూపాయల మేర తగ్గుతుంది. కాగాఎల్టి, హెచ్టి కనెక్షన్లను ఉపయోగించేవాణిజ్య పారిశ్రామిక రంగాలకు ప్రస్తుతం వసూలు చేస్తున్నచార్జీలే కొనసాగుతాయి. బెల్లం తయారీ, ఆక్వా పరిశ్రమలనువ్యవసాయం పరిధినుంచి తొలగించి మీటర్లు తప్పకుండాఅమర్చుకోవాలని నిర్దేశించారు.