వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పిఎంఒ ప్రక్షాళనకు శివసేన డిమాండ్
ముంబాయి: ప్రధాన మంత్రికార్యాలయంలోని కొందరు అధికారుల చర్యల వల్లమచ్చలేని ప్రధాని వాజ్పేయికి మచ్చ అంటుకుంటున్నదని శివసేన నేతబాల్థాకరే పేర్కొన్నారు. ప్రధాని కార్యాలయంలోనిముఖ్యలైన అధికారులు బ్రజేష్ మిశ్రా,ఎన్కె సింగ్ను అక్కడినుంచి ముందు తప్పించాలని తమఅధికార పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనపేర్కొన్నారు.
ప్రధాని వాజ్పేయి అల్లుడురంజన్ భట్టాచార్యను అధికార కార్యకలాపాలకుదూరంగా వుంచాలని కూడా ఆయన సూచించారు. ప్రధానివాజ్పేయి అసాధారణ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నారని ఈసంక్షోభ సమయంలో ఆయనకు అండగావుండటం మిత్రపక్షాల బాధ్యత అని కూడా ఆయనఅన్నారు.
అయితే తహల్కాటేపుల్లో ప్రస్తావనకు వచ్చిన బ్రజేష్,సింగ్, భట్టాచార్య విషయంలో ప్రధాని ఏదో ఒకటి చేస్తే గానీ ఈఅప్రదిష్టనుంచి బయటపడటం సాధ్యం కాదనిథాకరే అభిప్రాయపడ్డారు.
Comments
Story first published: Sunday, March 25, 2001, 23:53 [IST]