ఏప్రిల్ 3న గుజరాత్లోక్లింటన్ పర్యటన
ముంబాయి: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్క్లింటన్ ఏప్రిల్ 3వ తేదీన భారతదేశంలో భూకంపంతాకిడికి గురైన గుజరాత్ను సందర్శిస్తారు. ఈ ఏడాది జనవరి 26వ తేదీన గుజరాత్లో సంభవించిన భూకంప బాధితుల కోసంక్లింటన్ విరాళాలు సేకరిస్తున్నారు. తన ఐదు రోజులపర్యటనలో భాగంగా ఆయన కోల్కతా, ఢిల్లీలను కూడాసందర్శిస్తారు.
క్లింటన్ ఇక్కడికి చేరుకున్నవెంటనే గుజరాత్కు బయలుదేరి వెళ్లిఅహ్మదాబాద్, భుజ్లలో పర్యటిస్తారు. ఆయనసహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న ప్రభుత్వేతర సంస్థలప్రతినిధులను, అధికారులనుకలుసుకుంటారు. ఆయన ఏప్రిల్ 4వ తేదీనముంబాయి తిరిగి వస్తారు. ఆ రోజు ఆయనకురిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన అంబానీలుస్వాగత ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ముంబాయినుంచి క్లింటన్ కోల్కత్తా బయలుదేరి వెళ్తారు.ఆయన అక్కడ మదర్ థెరిసా మిషనరీల చారిటీహోంను సందర్శిస్తారు. కోల్కత్తా నుంచి ఢిల్లీకి తిరిగివచ్చే క్లింటన్ గౌరవార్థం ప్రధాని వాజ్పేయిడిన్నర్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
భార్య హిల్లరీ, కూతురు చెలిసాక్లింటన్తో పాటు భారత్కు రావడం లేదని తెలుస్తోంది.న్యూయార్క్ సెనేటర్ అయిన హిల్లరీ తనఅధికార కార్యకలాపాల్లో, చెలిసా తన చదువులో బిజిగా వుండడంవల్ల రావడం లేదని అధికార వర్గాల భోగట్టా.