వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మిలిటెంట్ల దాడి:ముగ్గురు ఆఫీసర్లు బలి
జమ్మూ: కాశ్మీర్లో మిలిటెంట్లు జరిపిన ఆకస్మికదాడికి ముగ్గురు సీనియర్ సిఆర్పిఎఫ్ అధికారులుబలయ్యారు. మిలిటెంట్లు సోమవారం శ్రీనగర్లోని టాగోర్హాల్ సమీపంలోని సిఆర్పిఎఫ్ శిబిరంపై మిలిటెంట్లు దాడిచేశారు.
ముగ్గురు మిలిటెంట్లు శిబిరంలోకి ప్రవేశించివిచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.పెద్ద యెత్తున కాల్పులు జరపడంతో పాటు మిలిటెంట్లు గ్రెనేడ్లువిసిరారు. సిఆర్పిఎఫ్ బలగాలకు, మిలిటెంట్లకు మధ్య సోమవారంసాయంత్రం వరకు కూడా కాల్పులు జరగుతూనేవున్నాయి.
Story first published: Monday, March 26, 2001, 23:53 [IST]