మమతతో కాంగ్రెస్ దోస్తీ
న్యూఢిల్లీః నిన్నటి వరకుబద్ధ శత్రువులుగా వున్న కాంగ్రెస్, తృణమూలుకాంగ్రెస్ పార్టీలు త్వరలో జరిగే బెంగాల్ అసెంబ్లీఎన్నికల్లో పొత్తు కుదుర్చుకొనే అవకాశాలు మెరుగయ్యాయి.నిన్నటి వరకు ఎన్డీఏలో కీలక పాత్ర పోషించిన తృణమూల్ అధినేత్రిమమతా బెనర్జీ తెహల్కా వ్యవహారం కారణంగాకేంద్ర సర్కార్క్ తో తెగతెంపులుచేసుకున్నారు. ఎన్డీఏ తో సంబంధాలు పూర్తిగా తెంచుకున్నట్లు మమత ప్రకటించక పోయినప్పటికీకాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకే మమతమొగ్గు చూపుతున్నారు. పైగా తృణమూల్ కాంగ్రెస్ తో పొత్తుఅవకాశాలు తక్కువే అని ప్రధాని వాజ్ పేయి ఆదివారం ప్రకటించడంతో మమత కులైన్ క్లియర్ అయింది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కమల్ నాథ్ రంగంలోకిదిగి మమతతో చర్చలు జరిపారు. ప్రస్తుతంహాంకాంగ్ లో పర్యటిస్తున్న సోనియా గాంధీ తిరిగిరాగానే రెండు మూడు రోజుల్లోమమత-కాంగ్రెస్ పొత్తు ఖరారు కాగలదని భావిస్తున్నారు. ఈపరిణామంతో పశ్చిమ బెంగాల్ లో త్రిముఖ పోటీఅనివార్యంగా కనిపిస్తున్నది.