తొలి వన్డేలో భారత్జయభేరి
బెంగుళూరుఃటెస్టుల్లోనే కాదు వన్డేల్లో కూడా భారత్ విజయపరంపర కొనసాగుతున్నది.బెంగుళూరులో ఆదివారం జరిగిన డే నైట్మ్యాచ్ లో భారత్ ఆస్ట్రేలియాపై ఘన విజయంసాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ అద్భుతంగా ఆడి 315 పరుగులుచేయగా, ఆస్ట్రేలియా 43.3 ఓవర్లలో 255 పరుగులు మాత్రమేచేయగలిగింది.
వరుసగా 11వ వన్డేలో కూడావిజయం సాధించి వెస్టిండీస్ పేరిట వున్నవరల్డ్ రికార్డ్ సమంచేయాలనే ఆస్ట్రేలియా ఆశలు గంగూలీబృందం విజయంతో అడియాసలయ్యాయి.
టాస్ గెలిసి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న గంగూలీ ఓపెనర్ గా బరిలోకి దిగాడు. అయితే 6పరుగులకే గంగూలీ ఫ్లెమింగ్ బౌలింగ్ లో మార్క్ వా కు క్యాచి ఇచ్చిఅవుటయ్యాడు. ఆ తరువాత సచిన్ విజృంభించాడు.మెక్ గ్రాత్ బౌలింగ్ లో ఒక ఓవర్ లోని మూడుఫోర్లు, ఒక సిక్స్ కొట్టి ఆస్ట్రేలియన్లకు ముచ్చెమటలు పూయించాడు. 24 బంతుల్లో 35 పరుగులు చేసినసచిన్ దురదృష్ట వశాత్తు రనౌట్ అయ్యాడు. ఆ తరువాత లక్ష్మణ్ విజృంభించి 45 పరుగులు చేశాడు, ఆ తరువాతద్రవిడ్ 80, కీపర్ దహియా 51, కొత్త ఆటగాడు వీరేంద్రసెహవాగ్ 58 పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోరుసాధించింది.
ఇంత భారీస్కోరును అందుకొనేదిశగా ఆట ప్రారంబించిన ఆస్ట్రేలియా త్వరత్వరగామార్క్ వా, పాంటింగ్ వికెట్లు కోల్పోయినా ఓపెనర్ హెడెన్,బెవాన్ లు అద్భుతంగా ఆడడంతో ఒక దశలో భారత్ పైసునాయాసంగా విజయం సాధిస్తుందనుకున్నారు. ఈ తరుణంలో బౌలింగ్ చేపట్టిన కొత్త కుర్రాడువీరేంద్ర షెహవాగ్ అద్భుతం సృష్టించాడు. 99
పరుగుల వద్ద హెడెన్ను అవుట్ చేశాడు. ఆ తరువాత స్టీవ్ వా, మార్టిన్ లవికెట్లు కూడా అతనికే లభించాయి. దీనితోఆస్ట్రేలియా 43 ఓవర్లకే ఆలౌటయింది.
ఆస్ట్రేలియాపై అఖండ విజయంసాధించడంలో కీలక పాత్ర పోషించిన వీరేంద్రషెహవాగ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.