వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యాలో ఆంధ్ర దంపతుల హత్య Home Full Story

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః దేశం కానిదేశంలో తెలుగుదంపతులు హత్యకుగురయ్యారు. రష్యాలోని పీటర్స్‌ బర్గ్‌ లో ఆంధ్రరాష్ట్రానికిచెందిన వి. సుబ్బారావు, ఆయన సతీమణిహిమబిందు ఈ నెల 12న దారుణ హత్యకుగురైనట్లు హైదరాబాద్‌ కు ఇటీవల సమాచారంఅందింది. అయితే వారి మృతదేహాలు సైతం ఇప్పటివరకు స్వస్థలం చేరలేదు.

డబ్బుకు ఆశపడి ఈ దంపతులను కిడ్నాప్‌ చేసి ఆ తరువాతదుండగులు వారిని హత్య చేసినట్లు ప్రాథనిక సమాచారం ద్వారా తెలుస్తున్నది. హత్యకుగురైన సుబ్బారావు, హిమబిందులమృతదేహాలు ఈ నెల 15న రష్యా పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. వారి మృత దేహాలను సుబ్బారావుసహోద్యోగి ఒకరు గుర్తించారు. సుబ్బారావు పేరిటబ్యాంకులో వున్న డబ్బును దుండగులు అక్రమంగా డ్రా చేసుకున్నారని కూడా తెలిసింది.వీరిద్దరి మృత దేహాల కోసం హైదరాబాద్‌లో వున్న సుబ్బారావు తల్లిదండ్రులుఆవేదనగా ఎదురు చూస్తున్నారు.

గుంటూరు జిల్లా వినుకొండ కుచెందిన సుబ్బారావు 16 ఏళ్ళుగా రష్యాలో వుంటున్నారు.ఆయన అక్కడ ఒక పొగాకు వ్యాపార్‌ సంస్థను ప్రారంభించి బాగాఆర్జించారు. రష్యాకు చెందిన మొదటి భార్య కు విడాకులు ఇచ్చినఆయన గుంటూరు లోని కొరిటిపాడుకు చెందినహిమబిందు అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. ఈనెల మొదటి వారంలో భారత్‌ వచ్చినసుబ్బారావు, హిమబిందు హైదరాబాద్‌ లోనితల్లిదండ్రులు, గుంటూరు లోని ఆయన సోదరుని కలుసుకొని సరదాగాగడిపారు. ఆ తరువాత రష్యా తిరిగి వెళ్ళి సుబ్బారావు దంపతులు హత్యకుగురయ్యారు.

పనివాడే హంతకుడా?
నల్గొండ జిల్లా దేవరకొండకు చెందినవ్యక్తిని సుబ్బారావు తన ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నాడు. అతడే సుబ్బారావు దంపతుల హత్యకు సూత్రధారి అని భావిస్తున్నారు. అతనిని పోలీసులుఅదుపులోకి తీసుకోవడంతో ఈ హత్య వ్యవహారంవెలుగు చూసిందని భావిస్తున్నారు.

వారంలో ఒక్కసారయిన ఫోన్‌ చేసే తన కుమారుడినుంచి ఫోన్‌ రాకపోవడంతో సుబ్బారావు తండ్రిశివప్రసాద్‌ రష్యాకు ఫోన్‌ చేశాడు. ఇంట్లో ఎవరూ ఫోన్‌లిఫ్ట్‌ చేయకపోవడంతో ఆఫీసుకు ఫోన్‌చేశారు. నాలుగురోజుల నుంచి సుబ్బారావు ఆఫీస్‌ కురావడంలేదని స్టాఫ్‌ చెప్పారు. ఆఫీస్‌ స్టాఫ్‌ వెంటనేస్పందించి పోలీసులకు, భారత దౌత్య కార్యాలయానికి సమాచారంఅందించారు.

ఈ లోగా మార్చి 15న సుబ్బారావు దంపతులమృతదేహాలు వారి కారులోనే సముద్రంఒడ్డున లభించాయి. ఈ కేసుపై రష్యా పోలీసులుదర్యాప్తు చేస్తున్నారు. దౌత్య కారణాల వల్ల సుబ్బారావు దంపతులమృతదేహాలు ఈ రోజుకూ హైదరాబాద్‌ చేరక పోవడంతో సుబ్బారావు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X