పాక్ తో క్రికెట్ కు భారత్ నో
న్యూఢిల్లీః షార్జా టోర్నీలోఆడరాదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈటోర్నమెంటులో పాకిస్తాన్, శ్రీలంకతో భారత్ తలపడాల్సివుంది. సరిహద్దులో పాకిస్తాన్ అనుసరిస్తున్నవైఖరి కారణంగా ఆ దేశంతో క్రికెట్ ఆడరాదని భారత్ ప్రభుత్వం కొంత కాలంకిందట నిర్ణయించింది. తదనుగుణంగాషార్జాలో పాకిస్తాన్ తో గత ఏడాది కూడా భారత జట్టుఆడలేదు. అయితే అంతర్జాతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డుకార్యదర్శి మాల్కం గ్రెగ్ మూడు రోజులుగా కొత్తఢిల్లీలో మకాం వేసి ఎన్డీఏ ప్రభుత్వాన్నిఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించారు.
ఆయన కేంద్ర హోం శాఖ మంత్రిఎల్. కె. అద్వానీ, క్రీడల శాఖ మంత్రి ఉమాభారతి,విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ లను కలుసుకొని ఈమేరకు చర్చలు జరిపారు. ఈ చర్చలు ఇలాజరుగుతుండగానే షార్జాలో మా జట్టుతో క్రికెట్ ఆడకపోతే ఇకమీదట ప్రపంచంలో ఎక్కడా భారత జట్టుతో క్రికెట్ఆడబోమని పాకిస్తాన్ ఆదివారం ప్రకటించింది.పాకిస్తాన్ బెదిరింపులను ఏ మాత్రం పట్టించుకోని భారత ప్రభుత్వం షార్జా టోర్నీకిదూరంగా వుండాలని నిర్ణయించింది.
సరిహద్దులో ఉగ్రవాదాన్నిప్రోత్సహిస్తూ వందలాది మందని బలిచేస్తున్నపాకిస్తాన్ తో స్నేహపూరిత వాతావరణంలో క్రికెట్ఆడడంలో అర్థం లేదని భారత ప్రభుత్వం భావిస్తున్నది.