వరంగల్: వరంగల్ ప్రభుత్వవైద్యశాలలో ఒక మహిళ మృతి చిలికి చిలికిగాలివానై డ్యూటీ డాక్టర్ సస్పెన్షన్కు దారి తీసింది. ప్రభుత్వ ప్రసూతివైద్యశాలలో చేరిన తన భార్య మంజులడ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే మరణించిందని భర్త ఆరోపిస్తున్నాడు. ఈ సంఘటన ఆందోళనకుదారి తీయడంతో ప్రభుత్వం డ్యూటీ డాక్టర్ను సస్పెండ్చేసింది. అయినా ఆందోళన ఆగకపోవడంతో ఖననం చేసిన మృతురాలిదేహాన్ని మళ్లీ పోస్ మార్టం చేసేందుకువెలికి తీశారు.డెలివరీ చేసి డ్యూటీ డాక్టర్వెళ్లిపోయిందని, ఆ తర్వాత విపరీతంగా బ్లీడింగ్జరిగిందని, మరో డాక్టర్ కూడా లేడని, నర్సులు మాత్రమేవున్నారని, దీంతో సరైన వైద్యం అందక తన భార్యమరణించిందని మృతురాలి భర్త ఆరోపిస్తున్నాడు.బ్లీడింగ్ను ఆపి వుంటే తన భార్య బతికి వుండేదని అతనంటున్నాడు. అయితే, ఈ ఆరోపణలు ఆస్పత్రివర్గాలు ఖండిస్తున్నాయి. ఆస్పత్రిలో సరైన సదుపాయాలు లేకపోవడంవల్ల, అంబులెన్స్ లేకపోవడం వల్ల మంజులచనిపోయిందని ఆస్పత్రి వర్గాలంటున్నాయి.
వరంగల్: వరంగల్ ప్రభుత్వవైద్యశాలలో ఒక మహిళ మృతి చిలికి చిలికిగాలివానై డ్యూటీ డాక్టర్ సస్పెన్షన్కు దారి తీసింది. ప్రభుత్వ ప్రసూతివైద్యశాలలో చేరిన తన భార్య మంజులడ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే మరణించిందని భర్త ఆరోపిస్తున్నాడు. ఈ సంఘటన ఆందోళనకుదారి తీయడంతో ప్రభుత్వం డ్యూటీ డాక్టర్ను సస్పెండ్చేసింది. అయినా ఆందోళన ఆగకపోవడంతో ఖననం చేసిన మృతురాలిదేహాన్ని మళ్లీ పోస్ మార్టం చేసేందుకువెలికి తీశారు.
డెలివరీ చేసి డ్యూటీ డాక్టర్వెళ్లిపోయిందని, ఆ తర్వాత విపరీతంగా బ్లీడింగ్జరిగిందని, మరో డాక్టర్ కూడా లేడని, నర్సులు మాత్రమేవున్నారని, దీంతో సరైన వైద్యం అందక తన భార్యమరణించిందని మృతురాలి భర్త ఆరోపిస్తున్నాడు.బ్లీడింగ్ను ఆపి వుంటే తన భార్య బతికి వుండేదని అతనంటున్నాడు. అయితే, ఈ ఆరోపణలు ఆస్పత్రివర్గాలు ఖండిస్తున్నాయి. ఆస్పత్రిలో సరైన సదుపాయాలు లేకపోవడంవల్ల, అంబులెన్స్ లేకపోవడం వల్ల మంజులచనిపోయిందని ఆస్పత్రి వర్గాలంటున్నాయి.