హైదరాబాద్: రాష్ట్రంలోఎక్సైజ్ పన్నును పెంచాలని రాష్ట్ర మంత్రి వర్గంమంగళవారం నిర్ణయించింది. ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఈవిషయమై నిర్ణయం తీసుకుంది. అయితే, ఏ మేరకు ఈ పన్నునుపెంచాలనే విషయంపై నిర్ణయం తీసుకోనట్లుసమాచారం.ఎక్సైజ్ పన్ను పెంపు ద్వారా లభించే సొమ్మునుసామాజిక, విద్యాభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చుపెట్టాలని మంత్రి వర్గ సమావేశం ఏకగ్రీవంగాఅభిప్రాయపడినట్లు చెబుతున్నారు. ఆబ్కారీ మంత్రి తుమ్మలనాగేశ్వరరావు, సంబంధిత అధికారులుసమావేశమై పన్నును ఏ మేరకు పెంచాలనేవిషయమై నిర్ణయం తీసుకుని తెలియజేస్తే ముఖ్యమంత్రిచంద్రబాబు ఆ విషయాన్ని శాసనసభలోప్రకటిస్తారు. మద్యం అమ్మకాలపై అదనంగా రెండు కోట్లరూపాయల ఆదాయం చేకూరేలా పన్ను పెంచాలని మంత్రివర్గం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. రాష్ట్ర అక్షరాస్యతా శాతం జాతీయ స్థాయి అక్షరాస్యత శాతం కన్నా తక్కువ ఉండడం పట్ల మంత్రివర్గం ఆందోళన వ్యక్తం చేసింది. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లనునిషేధిస్తూ కేంద్రం తెచ్చిన చట్టాన్నిరాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. శాసనసభ సమావేశాల తీరు తెన్నులపై కూడా మంత్రివర్గంచర్చించినట్లు తెలిసింది.
హైదరాబాద్: రాష్ట్రంలోఎక్సైజ్ పన్నును పెంచాలని రాష్ట్ర మంత్రి వర్గంమంగళవారం నిర్ణయించింది. ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఈవిషయమై నిర్ణయం తీసుకుంది. అయితే, ఏ మేరకు ఈ పన్నునుపెంచాలనే విషయంపై నిర్ణయం తీసుకోనట్లుసమాచారం.
ఎక్సైజ్ పన్ను పెంపు ద్వారా లభించే సొమ్మునుసామాజిక, విద్యాభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చుపెట్టాలని మంత్రి వర్గ సమావేశం ఏకగ్రీవంగాఅభిప్రాయపడినట్లు చెబుతున్నారు. ఆబ్కారీ మంత్రి తుమ్మలనాగేశ్వరరావు, సంబంధిత అధికారులుసమావేశమై పన్నును ఏ మేరకు పెంచాలనేవిషయమై నిర్ణయం తీసుకుని తెలియజేస్తే ముఖ్యమంత్రిచంద్రబాబు ఆ విషయాన్ని శాసనసభలోప్రకటిస్తారు. మద్యం అమ్మకాలపై అదనంగా రెండు కోట్లరూపాయల ఆదాయం చేకూరేలా పన్ను పెంచాలని మంత్రివర్గం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర అక్షరాస్యతా శాతం జాతీయ స్థాయి అక్షరాస్యత శాతం కన్నా తక్కువ ఉండడం పట్ల మంత్రివర్గం ఆందోళన వ్యక్తం చేసింది. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లనునిషేధిస్తూ కేంద్రం తెచ్చిన చట్టాన్నిరాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. శాసనసభ సమావేశాల తీరు తెన్నులపై కూడా మంత్రివర్గంచర్చించినట్లు తెలిసింది.