చేనేతకు చేయూతః చంద్రబాబు
హైదరాబాద్ః చేనేత రంగాన్నితెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. చేనేత రంగం పరిస్థితినానాటికీ అధ్వాన్నంగా మారుతున్నదంటూ కాంగ్రెస్ తోసహా అన్ని ప్రతిపక్ష పార్టీలు మంగళవారం అసెంబ్లీలో ఆందోళనవ్యక్తం చేశాయి. కాంగ్రెస్ సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నచేనేత శాఖ మంత్రి పడాల భూమన్నపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకొనిరాష్ట్రంలో చేనేత రంగాన్ని అన్నివిధాలా ఆదుకుంటామనిహామీ ఇచ్చారు. చేనేత రంగ కార్మికులకు వున్న బకాయిలనుసత్వరం చెల్లిస్తామని ఆయన స్పష్టంచేశారు. చేనేత రంగానికి చెందిన 25 వేలమందిని గుర్తించి వారికి వృద్ధిప్య పెన్షన్లుఇవ్వనున్నట్లు చంద్రబాబు నాయుడుప్రకటించారు.
ప్రభుత్వ సమాధానంతో సంతృప్తిచెందిని కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభ నుంచివాకౌట్ చేశారు. ప్రభుత్వ చేనేత రంగం పట్ల ఏ మాత్రంశ్రద్ధ చూపడం లేదని, అమలు కాని హామీలను మాత్రంకురిపిస్తున్నదని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు.