బ్యాక్ లాగ్ భర్తీపైవిపక్షం ధ్వజం
హైదరాబాద్ః
బ్యాక్
లాగ్
పోస్టుల
భర్తీఅంశంపై
గురువారం
అసెంబ్లీలో
గందరగోళం
చెలరేగింది.
రాష్ట్రంలో
దీర్ఘకాలంగా
ఖాళీగా
వున్న
39
వేల
బ్యాక్
లాగ్
పోస్టుల
భర్తీవిషయంలో
రాష్ట్ర
ప్రభుత్వం
అసాధారణ
జాప్యం
చేస్తున్నదంటూ
కాంగ్రెస్
పార్టీ
ధ్వజమెత్తింది.
బ్యాక్ లాగ్ పోస్టులను ఏడాదిలోగా భర్తీ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చిందని, ఆ హామీని కూడా ప్రభుత్వం తుంగలో తొక్కిందని ప్రతిపక్ష నేత వై.ఎస్. రాజశేఖర రెడ్డివిమర్శించారు. ఎస్.సి. ఎస్టీల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న నిధులను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దారిమళ్ళిస్తున్నదని ఆయన దుయ్యబట్టారు.
ఎస్.సి. ఎస్.టి.ల పట్ల తెలుగుదేశం ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు. ఈఅంశంపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పుష్పలీల ఇచ్చిన సమాధానానికి ప్రతిపక్షమంతా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీనితో ఈ వ్యవహారంపై ఒకటి రెండు రోజులలో ఖచ్చితమైన ప్రకటన చేస్తానని పుష్పలీల హామీ ఇచ్చారు. దీనితో సభ సద్దుమణిగింది.