వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జంటనగరాలకు కృష్ణా జలాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:జంటనగరాలకు కృష్ణాజలాలనురప్పించే స్కీమ్‌ దాదాపుగా ఖరారయిందని ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు గురువారం నాడు అసెంబ్లీలోప్రకటించారు. సుమారు 680 కోట్ల రూపాయలతో కృష్ణాజలాలను జంటనగరాలకురప్పించేందుకు వీలుగా పైప్‌లైన్లు ఇతరమౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్టుగాఆయన చెప్పారు. మొత్తం 9 కోట్ల గ్యాలన్ల నీళ్లను జంటనగరాలకుకృష్ణానదినుంచి ఈ స్కీమ్‌ కింద సరఫరా చేస్తారనిఆయన చెప్పారు. తొలిదశలో 4.5 కోట్ల గ్యాలన్లనీళ్ల సరఫరాకు వీలుగా పైప్‌లైన్లను వేయనున్నట్టుగాఆయన చెప్పారు.

వ్యయం మొత్తాన్ని క్రమంగా రాబట్టడానికివీలుగా నీటి చార్జీలను పెంచకతప్పదని కూడా ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి ఈ మాట చెప్పగానే ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరంవ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రజలపైఅపరిమితమైన భారం పడిందని మరింత భారంనీటి చార్జీల రూపంలో వేయరాదని ప్రతిపక్ష సభ్యులు చేసిన సూచనను ప్రభుత్వం తిరస్కరించింది.నీటి కొరతతో అల్లాడుతున్న ప్రజలు ప్రైవేట్‌ ట్యాంకర్లనుంచిపెద్దమొత్తంలో డబ్బులు చెల్లించి నీళ్లను కొనుగోలుచేస్తున్నారని, అందువల్ల నీటి కొరత లేకుండాచూస్తే చార్జీలు పెంచినా ప్రజలు ఇబ్బంది పడరని బీజేపీ నేతఇంద్రసేనారెడ్డి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X