తెలుగు భాషపై దృష్టిలేని దేశం సర్కార్!
హైదరాబాద్ః ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుభాష అమలు అధ్వాన్నంగా వున్నదంటూ ప్రతిపక్షాలువిమర్శించాయి. అసెంబ్లీ కార్యకలాపాలతో పాటు, పరిపాలనలోను, చివరకు హైకోర్టు వ్యవహారాలలో కూడా తెలుగు భాష వినియోగం నామమాత్రంగానే వుంటున్నదని బిజెపి సభపక్ష ఉపనాయకుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తెలుగుభాష వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వం ఏమైన చర్యలు తీసుకుంటున్నదా అని ఆయన ప్రశ్నించారు.
అయితే ఈ అంశంపై తెలుగు అంతంత మాత్రంగా వచ్చిన మంత్రిఅశోక గజపతి రాజు ఇచ్చిన సమాధానం సభను నవ్వుల్లో ముంచెత్తింది. తెలుగును నొక్కి నొక్కి పలుకుతూఅశోక్ గజపతి రాజు ప్రకటన మధ్య మధ్యలో ఆంగ్లంలో కూడా సాగింది. హైకోర్టు కార్యకలాపాలలో తెలుగుభాష ఉపయోగం అంతంత మాత్రంగానే వున్నదని మంత్రిఅంగీకరించారు.
ప్రభుత్వ
వ్యవహారాల్లో
కంప్యూటర్
వాడకాన్ని
భారీ
ఎత్తున
చేపడుతున్నామని
చెబుతున్న
ప్రభుత్వం
ఇంత
వరకు
తెలుగు
కీ
బోర్డులను
సేకరించడంలోవిఫలం
అయిందని
ప్రతిపక్షాలు
విమర్శించాయి.
ప్రభుత్వ
కార్యకలాపాల్లో
కంప్యూటర్లు
వాడుతున్నప్పటికీ
తెలుగు
కీబోర్డులు,
సాఫ్ట్
వేర్
సమకూర్చుకోకపోవడంతో
తెలుగు
పరిస్థితి
దయనీయంగా
మారిందని
ప్రతిపక్షాలు
ఆవేదన
వ్యక్తం
చేశాయి.