ఐ.ఎ.ఎస్ ల అవినీతిపై దద్దరిల్లినఅసెంబ్లీ
హైదరాబాద్ః సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలకు అవసరమైన సామాగ్రి కొనుగోలులో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ పార్టీ శుక్రవారంఅసెంబ్లీలో ఆరోపించింది. ప్రశ్నోత్తరాల సమయంలో ఈఅంశంపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఫలితంఅసెంబ్లీలో గందరగోళం చెలరేగింది.
సాంఘిక సంక్షేమ శాఖలో ఉపకార్యదర్శిగా వున్న సుబ్రహ్మణ్యం 80 లక్షల రూపాయల మొత్తంలో అవినీతికి పాల్పడినట్లు రుజువైనా ప్రభుత్వం ఇంతవరకు ఆయనపై చర్యతీసుకోలేదని కాంగ్రెస్ నేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఆరోపించారు. ఆయనతో పాటు ఇద్దరు ఐ.ఎస్.ఎస్. అధికారులకు కూడా ఇందులో పాత్ర వున్నట్లు రుజువైనా ప్రభుత్వం ఎందుకు వారి కొమ్ము కాస్తున్నదని ఆయన ప్రశ్నించారు. వారితో పాటు ప్రభుత్వంలో మరెవరికైనా కూడా ముడుపులుఅందాయా అని ఆయన నిలదీశారు. దీనిపై సభా సంఘం చేతవిచారణ జరిపించాల్సిన అవసరం వున్నదని వై.ఎస్. వ్యాఖ్యానించారు.
వై.ఎస్.
ఆరోపణలపై
అధికార
పక్ష
సభ్యులు
తీవ్ర
అభ్యంతరం
చెప్పడంతో
పాలక-ప్రతిపక్షాల
మధ్య
వాదోపవాదాలు
జరిగాయి.
ఈ
దశలో
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయుడు
జోక్యం
చేసుకొని
అవినీతికి
పాల్పడిని
అధికారులుఫైల్
ఈరోజే
తెప్పించుకొని
వారిపై
సత్వరం
చర్య
తీసుకుంటామని
హామీ
ఇచ్చారు.
దీనితో
ప్రతిపక్షాలు
శాంతించాయి.