సెన్సెక్స్ భారీ పతనం
ముంబాయి: స్టాక్మార్కెట్లో షేర్ల ధరలు శుక్రవారం నాడు భారీ ఎత్తున పతనమయ్యాయి. బిగ్బుల్గా ప్రచారంలోకి వచ్చిన కేతన్ పరేఖ్ను సిబిఐ ప్రశ్నిస్తున్నదన్న వార్తలు, కేతన్ పరేఖ్ చెల్లింపుల సంక్షోభంలో ఇరుకున్నారన్న వార్తలు మార్కెట్లో భయోత్పాతాన్ని సృష్టించాయి. మరో వైపు కలకత్తా స్టాక్ ఎక్స్చేంజ్ పాలక మండలిలో ఎన్నికైన సభ్యులంతా మూకుమ్మడిగా రాజీనామా చేయడం కూడా మార్కెట్లో కలవరం సృష్టించింది.
ట్రేడర్లు,
ఆపరేటర్లు,
ఇన్వెస్టర్లు
తెగబడి
అమ్మకాలు
సాగించడంతో
సెన్సెక్స్
143
పాయింట్ల
భారీ
నష్టాన్ని
చవిచూసింది.
స్టాక్మార్కెట్
చరిత్రలో
ఇది
మరో
బ్లాక్
ఫ్రైడే
గా
మిగులిపోయింది.
హిమాచల్
ఫ్యూచరిస్టిక్
16
శాతం
నష్టంతో
ముగియగా,
గ్లోబల్,
డిజిటల్,
డిఎస్క్యూ
సాఫ్ట్,
ఎస్ఎస్ఐ
12
శాతం
పైగా
నష్టంతో
ముగిసాయి.
ఇన్ఫోసిస్,
జీ
టెలీ,
విప్రో,
ఎన్ఐఐటి,
పెంటామీడియా
వంటి
కీలక
సంస్థల
షేర్ల
ధరలు
గణనీయంగా
తగ్గాయి.
పాతతరం షేర్లలో ఎసిసి, ఎంటిఎన్ఎల్, గ్రాసిం, ఆర్పిఎల్, ఎస్బిఐ, టిస్కో, డాక్టర్ రెడ్డీస్, రాన్బాక్సీ, బిపిసిఎల్ టెల్కో, టాటా పవర్ నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 3604 వద్ద ముగియగా, నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 1149 వద్ద క్లోజయింది. బేర్స్ స్వైరవిహారం జరిపినప్పటికీ బ్లూస్టార్, దీపక్ నైట్రేట్, నాగరీక ఎక్స్పోర్ట్స్, గోల్డ్స్టోన్, లూపిన్ లాబ్, బాంక్ ఆఫ్ పంజాబ్ వంటి కొన్ని షేర్లు మాత్రం పుంజుకున్నాయి.