ఇద్దరు కేతన్అనుచరుల అరెస్టు
న్యూఢిల్లీ: స్కాట్ మార్కెట్ కుంభకోణానికి పాల్పడిన బిగ్బుల్కేతన్ పరేఖ్ అనుచరులను ఇద్దర్ని కేంద్రదర్యాప్తు సంస్థ (సిబిఐ) శనివారం అరెస్టు చేసింది. ఈఇద్దరిలో ఒక వక్తి కేతన్ పరేఖ్ బంధువు,భాగస్వామి కాగా మరో వ్యక్తి అహ్మదాబాద్ బ్యాంక్మేనేజర్. సెలెక్ట్ షేర్ల ధరలను మాయచేయడంలో ఈ ఇద్దరు కేతన్ పరేఖ్కు సహకరించినట్లుఅనుమానిస్తున్నారు.
మాధవపుర బ్యాంక్ మేనేజర్నుఅరెస్టు చేసినట్లు, దాని బ్రాంచ్ మండవి (దక్షిణముంబాయి)లో వున్నట్లు, పరేఖ్ బంధువు,భాగస్వామి కార్తిక్ పరేఖ్ను అరెస్టు చేసినట్లు,కేతన్ పరేఖ్ మరో బంధువు కిరిటిక్ అరెస్టు కోసంచూస్తున్నట్లు సిబిఐ అధికారులు చెప్పారు.
పరేఖ్ రిమాండ్ పొడిగింపునకువిజ్ఞప్తి చేస్తున్నామని, దీని వల్లమాధవపుర మర్కంటైల్ కో ఆపరేటివ్ బ్యాంక్నుంచి నిధులను తరలించడంలో అతనికి ఉపయోగపడినవారి వివరాల గురించి ప్రశ్నించడానికి సమయం దొరుకుతుందనివారన్నారు. త్వరలో కిరీటకిని అరెస్టు చేస్తామని,పరేఖ్ను, ఇతరులను ప్రశ్నించడం వల్లబ్రోకర్లకు, బ్యాంక్ అధికారులకు, ఇతరులకు మధ్య గల సంబంధాలు వెల్లడి కాగలవనివారన్నారు.