వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫాక్షన్‌ హత్యలపై సభా సంఘం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాయలసీమను నెత్తుడి గడ్డగా మార్చిన ఫాక్షన్‌ హింసాకాండపైవిచారణకు సభా సంఘాన్ని నియమించేందుకు రాష్ట్రప్రభుత్వంఅంగీకరించింది. ఫాక్షన్‌ రాజకీయాలకు మూలం, వీటిని అరికట్టడానికి తీసుకోవల్సిన చర్యలపై సభాసంఘం దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. శనివారం నాడు కర్నూలు జిల్లా కప్పట్రాల గ్రామంలో జరిగిన ఫాక్షన్‌ హత్యాకాండవిషయం అసెంబ్లీలో చర్చకు వచ్చింది. ఫాక్షనిస్టులను ఉక్కుపాదంతో అణిచివేస్తామని ప్రకటించిన ప్రభుత్వం కేవలం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఫాక్షనిస్టులపైనే ఉక్కుపాదం మోపుతున్నదని కాంగ్రెస్‌ నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు.

ఫాక్షనిజాన్ని పూర్తిగా రూపుమాపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తప్ప ఇలా ఒక వర్గాన్ని అణిచివేస్తూ మరో వర్గాన్ని వెనకేసుకురావడం మంచిది కాదని ఆయన అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు సహకరిస్తే ఫాక్షన్‌ రాజకీయాలను తుడిచిపెట్టడం కష్టం కాదని హోం మంత్రి దేవేందర్‌గౌడ్‌ అన్నారు. రాయలసీమ, గుంటూరు జిల్లాలోని పల్నాడులో అభివృద్ధికి ఫాక్షన్‌ ఘర్షణలు అడ్డంకిగా వున్నాయని ఆయన చెప్పారు. కప్పట్రాల గ్రామం హత్యాకాండపై సమగ్రవిచారణ జరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X