కస్టమ్స్ అధికారులఇళ్లపై సిబిఐ దాడులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగాకస్టమ్స్ అధికారుల కార్యాలయాలపై, ఇళ్లపైకేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) పెద్ద యెత్తునదాడులు ప్రారంభించింది. ఢిల్లీ, ముంబాయి,కోల్కటా, తదితర నగరాల్లో ఈ దాడులుప్రారంభమయ్యాయి.
శుక్రవారం ప్రారంభమైన ఈదాడులు ఇంకా కొనసాగుతున్నాయని, ఇంత వరకు అరెస్టులు ఏమీజరగలేదని సిబిఐ వర్గాలు శనివారం సాయంత్రంచెప్పాయి.
ఢిల్లీలో 50 చోట్ల, ముంబాయిలో ఆరుచోట్ల, హర్యానాలో మూడు చోట్ల ఈ దాడులుజరిగాయి. కోల్కోటాలో ఒక చోట, కేరళలో ఒక చోట ఈదాడులు నిర్వహించారు. దాడులు ఇంకాకొనసాగుతున్నందున స్వాధీనం చేసుకున్నవాటి వివరాలు చెప్పడం కష్టమని సిబిఐ వర్గాలంటున్నాయి.
కొన్ని యంత్రాలను దేశంలోకి స్మగుల్చేసేందుకు ప్రయత్నించిన ఉజ్బెక్ మహిళనున్యూఢిల్లీలో అరెస్టు చేశారు. ఈ మహిళ ఇచ్చిన సమాచారంమేరకు స్మగ్లింగ్కు సహకరించారనే ఆరోపణపైముంబాయిలో ఎనమండుగురు కస్టమ్స్ అధికారులనుఅరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కస్టమ్స్ అధికారులఇళ్లల్లో, కార్యాలయాల్లో సిబిఐ భారీ సోదాలకు శ్రీకారంచుట్టింది.
సెంట్రల్ ఎక్సయిజ్, కస్టమ్స్ బోర్డుచైర్మన్ బి.పి. వర్మ ఇంటిలో, కార్యాలయంలో సిబిఐ సోదాలునిర్వహించింది. ఆయనకు సంబంధమున్నట్లు భావిస్తున్న 13 ఇతరచోట్ల కూడా సిబిఐ దాడులు నిర్వహించింది. చైర్మన్ ఆఫీసర్ ఆన్స్పెషల్ డ్యూటీ సందీప్ శ్రీవాస్తవ ఇంటిపై, వర్మ భార్య నడుపుతున్నపాఠశాలపై సిబిఐ దాడులు చేసింది.
-
కస్టమ్స్
బోర్డు
చైర్మన్కు
ఉద్వాసన