కస్టమ్స్ బోర్డుచైర్మన్కు ఉద్వాసన
న్యూఢిల్లీ: సిబిఐ దాడులనేపథ్యంలో ప్రభుత్వం శనివారం సెంట్రల్కస్టమ్స్, ఎక్సయిజ్ బోర్డు చైర్మన్ బి.పి. వర్మనుపదవి నుంచి తొలగించింది. ఇళ్లపై, కార్యాలయాలపై చేసినదాడుల్లో వర్మ ఒక ప్రయివేట్ కంపెనీకి అక్రమంగాసహాయం పొందాడని తేలడంతో ప్రభుత్వం ఈచర్య తీసుకుంది.
అక్రమ సహాయం పొందిచెన్నైకి చెందిన మెసర్స్ ఎకె ఎంటర్ప్రైజెస్ ఎగుమతులవిషయంలో నిబంధనలకు విరుద్ధంగా సహాయం చేశాడనివర్మపై ఆరోపణ. వర్మపై, ఆయన కుమారుడుసిద్ధార్థవర్మపై, కంపెనీ యజమాని కిరణ్కుమార్మూల్చంద్పై, మధ్యవర్తి విజయ్ ప్రతాప్పైతాము శుక్రవారం కేసు దాఖలు చేశామని అధికార ప్రతినిధి ఒకరుచెప్పారు.
సిబిఐ వర్మ ఇళ్లు, కార్యాలయంతో పాటుఆయనకు సంబంధించిన 15 చోట్ల, ఆయనకుమారుడికి చెందిన నాలుగు వ్యాణిజ్యసంస్థలలో సోదాలు చేసింది. వర్మ, ఆయన కుటుంబసభ్యులుపెట్టిన భారీ పెట్టుబడులు ఈ సోదాల్లో బయటపడ్డాయని, మరిన్ని ఆస్తులకు సంబంధించిన సమాచారంబయటపడనుందని సిబిఐ అధికార ప్రతినిధిచెప్పారు.
-
కస్టమ్స్
అధికారులఇళ్లపై
సిబిఐ
దాడులు