వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తొలి ట్రిబ్యునల్ బ్రాంచి ప్రారంభం
హైదరాబాద్: దేశంలోనేతొలిసారిగా హైదరాబాద్ లో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కుచెందిన లోక్ అదాలత్ బ్రాంచి ఆదివారంప్రారంభమైంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిబి.ఎన్. కృపాల్ దీన్ని ప్రారంభించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారు.హైకోర్ట్ లో పెండింగ్ లో ఉన్న పిటిషన్ల పరిష్కారానికిఇది ఎంతో ఉపయోగపడుతుందని కృపాల్ అన్నారు.
హైకోర్ట్ పై ఇది భారం తగ్గిస్తుందనిఆయన చెప్పారు. పాలనాపరమైన తగాదాలు వెంటనే పరిష్కారంఅవుతాయని, దేశంలోనే తొలిసారిగా ఈ ప్రయత్నం చేపట్టినఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ను ఆయనఅభినందించారు. ఆ తర్వాత అడ్మినేస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కుచెందిన రెండు వెబ్ సైట్లను కృపాల్, చంద్రబాబునాయుడుప్రారంభించారు.
Comments
Story first published: Sunday, April 1, 2001, 23:53 [IST]