వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమత-కాంగ్రెస్‌ మధ్యసర్దుబాటు!

By Staff
|
Google Oneindia TeluguNews

కోల్‌ కతాః పశ్చిమ బెంగాల్‌అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పోరాటానికి కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలోని 294అసెంబ్లీ స్థానాలలో 276 సీట్ల విషయంలో రెండు పార్టీల మధ్య సోమవారంఅంగీకారం కుదిరింది. మిగిలిన 18 స్థానాల విషయంలో నెలకొన్న అభిప్రాయా బేధాలపై త్వరలో మరోసారి సమావేశం కావాలని ఉభయ పార్టీలు నిర్ణయించాయి.

సీట్ల ఒప్పందం కుదుర్చుకున్న కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలు ఉమ్మడి మానిఫెస్టోకు, ఉమ్మడిగా ఎన్నికల ప్రచారానికి ససేమిరా అనడంవిశేషం. పశ్చిమ బెంగాల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ఇన్‌ ఛార్జీ కమలనాథ్‌ సోమవారం తృణమూల్‌ నేత మమతా బెనర్జీతో గంటన్నరసేపు చర్చలు జరిపారు.

మొత్తం మీద 276 సీట్ల విషయంలో ఉభయ పార్టీల మధ్యఅంగీకారం కుదిరింది. అయితే ఏ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేస్తుందనేవిషయాన్ని మాత్రం ప్రకటించలేదు.

సీట్ల పంపకం విషయంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ వైఖరి పశ్చిమబెంగాల్‌సీనియర్‌ నేతలు ప్రణబ్‌ ముఖర్జీతో సహా పలువురికి అసంతృప్తినేమిగిల్చింది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు అసంతృప్తి నేతలు మంగళవారం సమావేశం కానున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X