రిమాండ్ కు కస్టమ్స్ మాజీబాస్
న్యూఢిల్లీః కస్టమ్స్ఎక్సైజ్ బోర్డు మాజీ ఛైర్మన్ బి.పి. వర్మ, ఆయన కుమారుడు సిద్దార్ధ, స్టాక్ బ్రోకర్ భావన్ పాండేలను ఐదు రోజుల రిమాండ్ కు పంపుతూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆదాయానికిమించిన ఆస్తులు కలిగివున్న కేసులో వీరిపై సిబిఐ ఛార్జిషీటు దాఖలు చేసిన విషయం విదితమే. వీరికి అవసరమైన వైద్య పరీక్షలు జరిపించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది.
రెండు రోజులుగా సిబిఐ జరిపిన దాడులలో వర్మ ఇంట్లో కోటి రూపాయలకుపైగా ఆస్తులు దొరికాయి. పాతిక లక్షల వరకు ఆభరణాలు లభించాయి.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ కస్టమ్స్ ఎక్సైజ్ బోర్డు మాజీ ఛైర్మన్ గా పని చేసిన వర్మ భారీ ఎత్తున అవినీతికి పాల్పడినట్లు సిబిఐ ఆరోపించింది. వర్మ సహాయం పొందిన తమిళనాడుకు చెందినఎ.కె. ఎంటర్ ప్రైజెస్ అధినేత శరవణన్ ను కూడా సిబిఐ అధికారులు సోమవారంఅరెస్టు చేశారు. కస్టమ్స్ ఎక్సైజ్ బోర్డు మాజీ ఛైర్మన్ వర్మపై సిబిఐ దాడులు నిర్వహించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
వర్మ ఇంటిపై దాడిలో పెద్ద ఎత్తున నగదు, కీలకమైన డాక్యుమెంట్లు లభించినట్టుగా తెలుస్తున్నది. ఒక విదేశీవనితతో గత డిసెంబర్లో వర్మ జరిపిన సంభాషణ తాలూకు ఆడియో కాసెట్ కూడా సిబిఐ స్వాధీనంలో వున్నది. ఈ కాసెట్లో అనేక కీలకమైన విషయాల ప్రస్తావన వున్నదని అంటున్నారు.