వైభవంగా సీతారామ కల్యాణం
భద్రాచలం: పావన గౌతమి తీరంలోని భద్రాచల క్షేత్రంలో సీతారాముల కల్యాణ మహోత్సవం సోమవారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు, అసెంబ్లీ స్పీకర్ ప్రతిభా భారతి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర విఐపిలు రాష్ట్రం నలుమూలనుంచి వచ్చిన అశేష భక్తజనవాహిని ఈ కల్యాణ మహోత్సవాన్ని వీక్షించారు.
సంప్రదాయం ప్రకారం రాష్ట్రముఖ్యమంత్రి శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మలకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను తీసుకుని వచ్చారు. పండితుల వేదఘోష మధ్య విశిష్టాద్వైత మత సంప్రదాయం ప్రకారం పునర్వసుయుక్త కర్కాటలగ్న సుమూహర్తంలో సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.
శనివారం
గాలిదుమారం,
ఆదివారం
నాటి
గాలివానతో
కల్యాణ
వేడుకల
ఏర్పాట్లకు
అంతరాయం
కలగడంతో
ఆందోళన
చెందిన
అధికారులు
సీతారాముల
కల్యాణం
ప్రతియేడాది
లాగే
వైభవంగా
ప్రశాంతంగా
జరగడంతో
ఊపిరపీల్చుకున్నారు.
ఇదిలా
వుండగా
రాష్ట్రవ్యాప్తంగా
అన్ని
వైష్ణవాలయాల్లోనూ,
రామాలయాల్లోనూ
సీతారరాములు
కల్యాణ
వేడుకలు
ఘనంగా
జరిగాయి.