వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్‌ కాంగ్రెస్‌లో ముసలం

By Staff
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌, తృణమూల్‌ పార్టీల మధ్య ఎట్టకేలకు కుదిరిన సీట్ల సర్దుబాటు ఒప్పందం పై బెంగాల్‌ కాంగ్రెస్‌ వర్గాల్లో తీవ్ర అసమ్మతి వ్యక్తం అవుతున్నది. కాంగ్రెస్‌ అధిష్టానవర్గం ఆదేశాల మేరకు 294 స్థానాలకు గానూ 274 స్థానాలపై ఉభయపార్టీలు ఒక అవగాహనకు వచ్చినట్టుగా ప్రకటించాయి.

అయితే ఈ ఒప్పందంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తృణమూల్‌కు దాసోహం అన్నదని బెంగాల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వీరిని బుజ్జగించడానికి కాంగ్రెస్‌ నాయకత్వం మరికొందరు దూతలను పంపే అవకాశం వున్నదని చెబుతున్నారు. మమత ఎన్‌డిఎలో భాగస్వామిగా వున్నప్పుడు ఆమెతో పొత్తుకు కాంగ్రెస్‌ తిరస్కరించినందుకు కూడా బెంగాల్‌ కాంగ్రెస్‌లో తిరుగుబాటు తలెత్తిన విషయం విదితమే. అప్పట్లో అనేకమంది కాంగ్రెస్‌ వాదులు వెళ్లి టిఎంసిలో చేరారు. ఇప్పుడు తాజాగా పొత్తు కుదిరిన తర్వాత కూడా అదే సీన్‌ పునరావృత్తం కావడంతో కాంగ్రెస్‌ నేతలు తలపట్టుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X