క్రికెట్: భారత్పైఆస్ట్రేలియా గెలుపు
విశాఖపట్నం: ఐదు వన్డే మ్యాచ్ల క్రికెట్సిరీస్లో ఆస్ట్రేలియా ఇక్కడ జరిగిన నాలుగో వన్డేలో భారత్పై 93 పరుగుల తేడాతోవిజయం సాధించింది. దీంతో 2-2తో సిరీస్ సమంఅయింది. సిరీస్ సమం కావడంతో ఈ నెల 6వ తేదీనగోవాలో జరిగే వన్డే మ్యాచ్ కీలకంగా మారింది.టాస్ గెలిచి బ్యాటింగ్ను ఎంచుకున్నఆస్ట్రేలియా భారత్ బౌలర్లను చిత్తుచేసింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ప్రారంభించినకొద్ది సేపట్లోనే గిల్క్రిస్ట్ వికెట్నుకోల్పోయింది. ఆరు పరుగల వ్యక్తిగత స్కోర్ వద్దగిల్క్రిస్ట్ పెవిలియన్ దారి పట్టాడు. అయితే, ఆ తర్వాతవచ్చిన పోంటింగ్, ఓపెనర్ హేడెన్ భారత్ బౌలర్లను సమర్థంగాఎదుర్కుని భారీ స్కోర్కు బాటలు వేశారు. ఈ సిరీస్లోమంచి ఫామ్లో వున్న హెడెన్ 111 పరుగులు చేశాడు. అతనుమ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. పోంటింగ్ 101 పరుగులు చేశాడు.స్టీవ్ వా 35 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్దఅవుటయ్యాడు. ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలోనాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 338 పరుగుల భారీ స్కోర్చేసింది. బేవాన్ 43 పరుగులు చేసి నాటవుట్గా మిగిలాడు.
ఆస్ట్రేలియా పెట్టిన భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్కెప్టెన్ సౌరబ్ గంగూలీ, లిటిల్ మాస్టర్ సచిన్టెండూల్కర్ బ్యాటింగ్కు దిగారు. ఎప్పటి లాగే గంగూలీఆస్ట్రేలియా బౌలింగ్ను ఎదుర్కోవడంలో విఫలమయ్యాడు. గంగూలీ 36 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసిపెవిలియన్ దారి పట్టాడు. సచిన్, లక్ష్మణ్నిలకడగా ఆడుతారనుకున్న సమయంలో లక్ష్మణ్అవుటయ్యాడు. సచిన్ 62 పరుగుల వ్యక్తిగత స్కోర్వద్ద అవుట్ కావడంతో మ్యాచ్పై భారత్ పట్టుకోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ఎవరూనిలదొక్కుకోలేకపోయారు. హర్బజన్ సింగ్ మాత్రమేమెరుపు వేగంతో బంతులను కొడుతూ విశేషంగా ఆడాడు. మూడుసిక్స్లతో హర్బజన్ 46 పరుగులు చేసి అవుటయ్యాడు.షేన్వార్న్ మూడు వికెట్లు, మెక్గ్రాత్, బ్రాకెన్రెండేసి వికెట్లు, స్టీవ్వా 3 వికెట్లు తీసుకున్నారు.