ఆర్థిక సమస్యలకు చేనేత కుటుంబం బలి
కరీంనగర్ః కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో సోమవారం రాత్రిపెను విషాదం సంభవించింది. చేనేత రంగాన్ని అలముకున్న చీకట్లు ఒక చేనేత కార్మికుని కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. మరమగ్గం కార్మికుడు, ఆయన భార్య, ఇద్దరు సంతానం సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. చాలాకాలంగాఅప్పులతో బాధపడుతున్న ఈ కుటుంబం భవిష్యత్తు అంధకార బంధురంగా వుండడంతో ఆత్మహత్యే శరణ్యం అని భావించింది. పిల్లలకు సాఫ్ట్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి ఇచ్చి, భార్యా భర్తలు మద్యంలో పురుగుల మందు కలుపుకొని తాగి మరణించారు.
ఐదుగురు సభ్యులు గల ఈ కుటుంబంలో శాంతిప్రియ అనే చిన్నారి బతిక బయటపడడంవిశేషం. ఈ పాప పురుగుల మందు కలిపిన సాఫ్ట్ డ్రింక్ ను సరిగా తాగక పోవడంతో బతికి బయటపడింది. తల్లిదండ్రుల కోసం ఈ పాప చేసే ఆక్రందనలు హృదయవిదారకంగా వున్నాయి. తెలంగాణాలో చేనేత రంగంలో ఎంతోపేరు పొందిన సిరిసిల్ల ఈ నాడు విలవిల లాడిపోతున్నది. మరమగ్గాలన్నీ మూలపడడం, ప్రభుత్వం నుంచి ఏ మాత్రం సహాయంఅందక పోవడం, మరో ఉపాధి మార్గం లేక చేనేత కార్మికులు నానాటికీ దురవస్థల పాలవుతున్నారు.
2000
జనవరి
నుంచి
సిరిసిల్ల
ప్రాంతంలోనే
29
మంది
ఆత్మహత్యలు
చేసుకుంటున్నారంటే
చేనేత
రంగం
పరిస్థితి
ఎంత
దయనీయంగా
వున్నదోఅర్థం
చేసుకోవచ్చు.