వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్థిక సమస్యలకు చేనేత కుటుంబం బలి

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌ః కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో సోమవారం రాత్రిపెను విషాదం సంభవించింది. చేనేత రంగాన్ని అలముకున్న చీకట్లు ఒక చేనేత కార్మికుని కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. మరమగ్గం కార్మికుడు, ఆయన భార్య, ఇద్దరు సంతానం సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. చాలాకాలంగాఅప్పులతో బాధపడుతున్న ఈ కుటుంబం భవిష్యత్తు అంధకార బంధురంగా వుండడంతో ఆత్మహత్యే శరణ్యం అని భావించింది. పిల్లలకు సాఫ్ట్‌ డ్రింక్‌ లో పురుగుల మందు కలిపి ఇచ్చి, భార్యా భర్తలు మద్యంలో పురుగుల మందు కలుపుకొని తాగి మరణించారు.

ఐదుగురు సభ్యులు గల ఈ కుటుంబంలో శాంతిప్రియ అనే చిన్నారి బతిక బయటపడడంవిశేషం. ఈ పాప పురుగుల మందు కలిపిన సాఫ్ట్‌ డ్రింక్‌ ను సరిగా తాగక పోవడంతో బతికి బయటపడింది. తల్లిదండ్రుల కోసం ఈ పాప చేసే ఆక్రందనలు హృదయవిదారకంగా వున్నాయి. తెలంగాణాలో చేనేత రంగంలో ఎంతోపేరు పొందిన సిరిసిల్ల ఈ నాడు విలవిల లాడిపోతున్నది. మరమగ్గాలన్నీ మూలపడడం, ప్రభుత్వం నుంచి ఏ మాత్రం సహాయంఅందక పోవడం, మరో ఉపాధి మార్గం లేక చేనేత కార్మికులు నానాటికీ దురవస్థల పాలవుతున్నారు.

2000 జనవరి నుంచి సిరిసిల్ల ప్రాంతంలోనే 29 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే చేనేత రంగం పరిస్థితి ఎంత దయనీయంగా వున్నదోఅర్థం చేసుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X