వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
స్టాక్ కుంభకోణంపై జెపిసి దర్యాప్తు
న్యూఢిల్లీ :కోట్లాది రూపాయల స్టాక్మార్కెట్ కుంభకోణంపై పార్లమెంట్లోని అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి కమిటితో దర్యాప్తు జరిపించడానికి తమకు అభ్యంతరం లేదని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రమోద్మహాజన్ మంగళవారం నాడు చెప్పారు.
జెపిసి దర్యాప్తుకు ప్రభుత్వం విముఖంగా లేదని ఆయన స్పష్టం చేశారు. జెపిసి దర్యాప్తునకు పార్లమెంట్లోని ప్రధాన పార్టీలు డిమాండ్ చేస్తే ప్రభుత్వం సానుకూలంగా ప్రతిస్పందిస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్న కుంభకోణానికి 1992 నాటి కుంభకోణానికి దగ్గర సంబంధం వున్నదని, ఈ కుంభకోణంపై కూడా జెపిసి దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ కోరుతున్నది.
Comments
Story first published: Tuesday, April 3, 2001, 23:53 [IST]