జులై 31 లోగా స్థానిక ఎన్నికలు
హైదరాబాద్: గత ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తున్న మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికలను వచ్చే జులై 31 వ తేదీలోగా నిర్వహించాలని సుప్రీంకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. గత మార్చిలోనే జరగాల్సిన ఈ ఎన్నికలను రిజర్వేషన్ల విషయంలో తలెత్తిన సమస్య కారణంగా ప్రభుత్వం వాయిదా వేసిన విషయం విదితమే.
ఈ విషయంపై కాంగ్రెస్ కోర్టుకు వెళ్లింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు అవసరమైన గడవును కూడా ఇచ్చినందున బిసి, ఎస్సి, ఎస్టి జనాభా ఎక్కువగా వున్న ప్రాంతాలను గుర్తించి తదనుగుణంగా రిజర్వేషన్లు కల్పించి జులై 31 లోగా ఎన్నికలను పూర్తి చేయాలని సుప్రీం కోర్టుఆదేశించింది.
స్థానిక సంస్థలకు ఈ ఏడాది మార్చి 31ని సుప్రీంకోర్టు తుదిగడువుగా నిర్ణయించింది. అయితే బి.సి. రిజర్వేషన్ల నిర్దారించేందుకు అవసరమైన గణాకాంలసేకరణకు మరింత గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ సూత్రాలకువిరుద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికలను కావాలని వాయిదా వేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ తరపు న్యాయవాది వాదించారు.
ఇరు పక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు జూలై 31ని తుదిగడువుగా నిర్ణయించింది. ఇకమీదట గడువును పొడిగించేది లేదనికూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
స్థానిక
ఎన్నికలపై
వెనకడుగువేయంః
పోచారం
విజయవాడః
స్థానిక
సంస్థల
ఎన్నికల
విషయంలో
సుప్రీంకోర్టు
ఆదేశాలను
తు.చ.
తప్పకుండా
పాటిస్తామని
రాష్ట్ర
పంచాయతీ
రాజ్
శాఖ
మంత్రి
పోచారం
శ్రీనివాస
రెడ్డి
స్పష్టం
చేశారు.
జూలై
నెలాఖరు
లోగా
స్థానిక
సంస్థలకు
ఎన్నికలు
జరిపి
తీరాలంటూ
సుప్రీంకోర్టు
ఇచ్చిన
తీర్పుపై
ఆయన
పై
విధంగా
స్పందించారు.
బి.సి.
రిజర్వేషన్లకు
సంబంధించిన
గణాంకాల
సేకరణ
చురుకుగా
సాగుతున్నదని,
గడవులోగా
స్థానిక
సంస్థల
ఎన్నికలు
జరిపి
తీరతామని
ఆయన
హామీ
ఇచ్చారు.