వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిధుల వినియోగం పై నివేదికలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గ్రామీణాభివృద్ధి పథకాలకు కేటాయించిన నిధుల వినియోగంలో అవకతవకలు చోటుచేసుకుంటున్నందున ప్రభుత్వం ఇకనుంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నట్టుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు.

గ్రామ స్థాయిలో మండలస్థాయిలో జిల్లా స్థాయిలో ఇకనుంచి కేటాయించిన నిధుల వివరాలు, వ్యయం చేసిన నిధుల వివరాలను డిస్‌ప్లే చేయాల్సిందింగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా ఆయన చెప్పారు. ఈ నిధుల వ్యయంపై ఇకనుంచి ఆడిట్‌ కూడా వుంటుందని ఆయన తెలిపారు.

గ్రామీణాభివృద్ధి పథకాల నిధుల దుర్వినియోగం విషయంలో ప్రభుత్వం కఠినమైన వైఖరిని అవలంభిస్తుందని కూడా ఆయన చెప్పారు. ప్రజల్లో వివిధ పథకాలకు సంబధించిన చైతన్యం లేకపోవడం వల్ల నిధుల దుర్వినియోగానికి ఆస్కారం ఏర్పడుతున్నదని ఆయన చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన స్కీమ్‌లను సద్వినియోగం చేసుకునేలా ప్రజలను కూడా జాగృతం చేయనున్నట్టుగా ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X