వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

11 జిల్లాల్లో బంగారు, వజ్రాల నిక్షేపాలు

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడః ఖనిజ సంపదలతో అలరారుతున్న ఆంధ్ర రాష్ట్రం నుంచి బంగారం, వజ్రాల నిల్వలను వెలికితీసేందుకు పలు బహుళజాతి సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నది. ఈవిషయాన్ని రాష్ట్ర గనుల శాఖ మంత్రి ఉమామాధవ రెడ్డి బుధవారంవిజయవాడలో చెప్పారు. ఖనిజ సంపదల విషయంలో ఆంధ్ర రాష్ట్రం దేశంలో బీహార్‌ తరువాత రెండో స్థానాన్ని ఆక్రమించిందని ఆమె విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

రాష్ట్రంలో గుంటూరు, కృష్ణ, నల్గొండ, మహబూబ్‌ నగర్‌ జిల్లాలతో పాటు మొత్తం 11 జిల్లాలలో బంగారం, వజ్రాల నిక్షేపాలు వున్నట్లు జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తించిందని ఆమె వివరించారు. ఈ అమూల్య ఖనిజాలను వెలికి తీసేందుకు 16 బహుళజాతి సంస్థలకు అనుమతి ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. మొత్తం 1600 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు సంబంధించి పలు ప్రైవేట్‌ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఆమె వివరించారు.

ఈ ఏడాది రాష్ట్రం నుంచి 350 కోట్ల రూపాయల మొత్తంలో గ్రానైట్‌ ఎగుమతులు జరిగినట్లు ఆమె వివరించారు. తుమ్మలపాలె సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్‌ పోస్ట్‌ ను ఆమె ఈ సందర్భంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ క్వారీ తవ్వకాలు, తరలింపులను నిరోధించేందుకు ఇటువంటి చెక్‌ పోస్టులు భారీ సంఖ్యలో ఏర్పాటు చేయనున్నట్లు ఆమె చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X