వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిరసనల మధ్య ఎన్‌డిఎ నేతలకుస్వాగతం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తహల్కా వ్యవహారంలో ప్రజలకు నిజానిజాలు వివరించి తమ ప్రభుత్వ నిజాయితీని నిరూపించుకునేందుకు, కాంగ్రెస్‌ ప్రచారాన్ని ఎండగట్టేందుకు అధికార ఎన్‌డిఎ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు బుధవారం ఉదయం ఎన్‌డిఎ నేతలు అద్వానీ, జార్జ్‌ఫెర్నాండెజ్‌ తదితరులు హైదరాబాద్‌ చేరుకున్నారు.

బేగంపేట విమానాశ్రయంలో ఎన్‌డిఎ నేతలకు ఘనస్వాగతం చెప్పేందుకు బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేయగా మరోవైపు కాంగ్రెస్‌ సారథ్యంలో కేంద్రుప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి. ఎన్‌డిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, నినాదాలతో ప్రదర్శన జరపుతున్న కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఎన్‌డిఎ నేతలు బేగంపేట నుంచి నేరుగా ప్రత్యేక హెలీకాప్టర్‌లో నగర శివార్లలోని రామోజీ ఫిల్మ్‌ స్టూడియోకు వెళ్లారు.

అద్వానీ, జార్జ్‌తో పాటు కేంద్ర మంత్రులు విద్యాసాగర్‌రావు, వెంకయ్యనాయుడు, దత్తాత్రేయా కూడా రామోజీ స్టూడియోకు వెళ్లారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని స్టూడియోను సందర్శించిన అనంతరం సాయంత్రం నేరుగా నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బయలుదేరి వెళ్తారు. ఇదిలా వుండగా బుధవారం ఉదయం కల్లా బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభాస్థలిలో అద్వానీ, వాజ్‌పేయి భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X