వర్మపై మరో కేసు
న్యూఢిల్లీ: సస్పెన్షన్కుగురైన సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు చైర్మన్బి.పి. వర్మపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)మరో కేసు నమోదు చేసింది. వర్మ ఆదాయానికిమించిన అస్తులు కలిగి వున్నాడనే ఆరోపణపై అక్రమార్జన కేసును సిబిఐనమోదు చేసింది.
వర్మపై ఇప్పటికే సిబిఐకుట్ర, అధికార దర్వినియోగాల కింద రెండు కేసులునమోదు చేసింది. వర్మ, తన కుటుంబ సభ్యులపేరు మీద, బినామీ పేర్ల మీద ఆదాయానికి మించిన ఆస్తులు కలిగివున్నట్లు సిబిఐ అభియోగం మోపింది. వర్మఇంటిపై దాడి చేసినప్పుడు సిబిఐ స్వాధీనం చేసుకున్నకీలకమైన పత్రాలను అవినీతి నిరోధక శాఖ క్షణ్నంగాపరిశీలిస్తోంది. వర్మ ఇంటరాగేషన్ సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకుంది. శనివారంప్రారంభమైన వర్మ ఇంటరాగేషన్ ఆదివారం కూడాకొనసాగింది. వర్మతో పాటు ఆరుగుర్ని సిబిఐ అరెస్టుచేసింది.
ఇదిలా వుంటే, ఉజ్బెకిస్థాన్ముఠాను పట్టుకోవడానికి ఆ దేశ సహాయం తీసుకోవాలని సిబిఐఆలోచిస్తోంది.