వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వం వల్లే చేనేత ఆత్మహత్యలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని రాష్ట్ర చేనేత కార్మిక సంఘం విమర్శించింది. గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిరాదరణతో చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని సంఘం ప్రధాన కార్యదర్శి నీలం పండరి ఆదివారం విలేకరుల సమావేశంలో అన్నారు.

నిరాశకు, నిస్పృహకు లోనై చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆప్కోకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆప్కోకు 9 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించిందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X