వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అస్సాంలో ఎన్డీఏ-ఎజిపి దోస్తీ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీఃఅస్సాంలో ఎన్డీఏ-ఎజిపి చేతులు కలిపాయి. త్వరలో జరిగేఅసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని ఎన్డీఏ-ఎజిపి సోమవారం నిర్ణయించాయి.అసెంబ్లీ లోని మొత్తం 126 స్థానాలలో 44 స్థానాలను బిజెపికి కేటాయించాలని నిర్ణయించారు.మిగిలిన స్థానాలలో ఎజిపి భాగస్వామ్య పార్టీలు పోటీ చేస్తాయి. ఎజిపి ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుందనేవిషయం ఇంకా నిర్థారణ కాలేదు.

అస్సాం ముఖ్యమంత్రి, ఎజిపి అధినేత ప్రఫుల్ల కుమార్‌ మహంత, బిజెపిసీనియర్‌ నేతలు అద్వానీ తదితరులు సోమవారం కొత్త ఢిల్లీలో సమావేశమై పొత్తును ఖరారు చేశారు.అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడంతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా చేరాలనిఅస్సాం గణసంగ్రామపరిషత్‌ నిర్ణయించడం మరోవిశేషం. ఎ.జి.పి.కి ఇద్దరు ఎం.పి.లు వున్నారు. కాంగ్రెస్‌ పార్టీని చిత్తుగా ఓడించడమే లక్ష్యంగా ఎన్డీఏతో చేతులు కలిపినట్లు ప్రఫుల్ల కుమార్‌ మహంత చెప్పారు.

ఎన్డీఏ-ఎజిపి పొత్తుకు అప్పుడే అరిష్ఠాలు మొదలయ్యాయి. ఎన్డీఏతో చేతులు కలపడాన్ని ఎజిపిలో కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ అసమ్మతిని మహంత ఏ విధంగా బుజ్జగిస్తారో....అస్సాంకోటలో తిరిగి ఎలా పాగా వేస్తారో వేచి చూడాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X